గొర్రెలను కొనడం కాదు… రెఫరెండానికి సిద్ధమా!

ఏపీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపులపై గవర్నన్‌ను కలిసి ప్రతిపక్ష నేత జగన్ ఫిర్యాదు చేశారు. తప్పుడు విధానాలతో కాంట్రాక్టర్లకు లబ్ది చేకూరుస్తూ… వారిచ్చిన లంచాలతోనే చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను కొంటున్నారని గవర్నర్‌కు చెప్పారు.  ఒక్కో ఎమ్మెల్యేను రూ. 20 కోట్ల నుంచి 30 కోట్లకు కొంటున్నారని వీటిపై విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరినట్టు జగన్ చెప్పారు. పట్టపగలు ఏపీలో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. బ్లాక్ మనీతో గొర్రెలను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొనడం కాదని… చంద్రబాబుకు […]

Advertisement
Update: 2016-04-23 01:07 GMT

ఏపీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపులపై గవర్నన్‌ను కలిసి ప్రతిపక్ష నేత జగన్ ఫిర్యాదు చేశారు. తప్పుడు విధానాలతో కాంట్రాక్టర్లకు లబ్ది చేకూరుస్తూ… వారిచ్చిన లంచాలతోనే చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను కొంటున్నారని గవర్నర్‌కు చెప్పారు. ఒక్కో ఎమ్మెల్యేను రూ. 20 కోట్ల నుంచి 30 కోట్లకు కొంటున్నారని వీటిపై విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరినట్టు జగన్ చెప్పారు. పట్టపగలు ఏపీలో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. బ్లాక్ మనీతో గొర్రెలను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొనడం కాదని… చంద్రబాబుకు సిగ్గు, లజ్జ ఉంటే పిరాయించిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పును రెఫరెండంగా తీసుకునేందుకు చంద్రబాబు సిద్ధం కావాలని జగన్ సవాల్ విసిరారు. చంద్రబాబుకు తన పాలనపై తనకే నమ్మకం లేదని జగన్ ఎద్దేవా చేశారు. 67 మంది ఎమ్మెల్యేల్లో 12 మందితో పాటు మరో ముగ్గురు నలుగురు పోయినా తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. కానీ చంద్రబాబు చేస్తున్న పాపానికి మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News