బొక్కలిరిసి కుప్ప పెడుతా...

టీఆర్ఎస్ మహిళ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సభా వేదిక వద్ద కాంగ్రెస్, బీజేపీనాయకులు, సమీప గ్రామప్రజలు కలిసి నిరసనకు దిగగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బొడిగె శోభ వార్నింగ్ ఇస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఈటెల రాజేందర్ సమక్షంలోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘బెదిరిస్తే పోయెటోళ్లం కాదు.. ప్లకార్డులు పట్టుకొని వస్తే.. మేం గంత సోయి లేనోళ్లం కాదు.. మేమెంత వర్కు జేత్తున్నమో గీ ప్రజలకు తెలువదా?       ఇంకొక్కసారి మేం […]

Advertisement
Update: 2016-04-21 22:47 GMT
టీఆర్ఎస్ మహిళ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సభా వేదిక వద్ద కాంగ్రెస్, బీజేపీనాయకులు, సమీప గ్రామప్రజలు కలిసి నిరసనకు దిగగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బొడిగె శోభ వార్నింగ్ ఇస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఈటెల రాజేందర్ సమక్షంలోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
‘బెదిరిస్తే పోయెటోళ్లం కాదు.. ప్లకార్డులు పట్టుకొని వస్తే.. మేం గంత సోయి లేనోళ్లం కాదు.. మేమెంత వర్కు జేత్తున్నమో గీ ప్రజలకు తెలువదా? ఇంకొక్కసారి మేం జేసే కార్యక్రమానికి వస్తే మంచిగుండదు.. మా పోలీసోల్లైతే ఏం సేత్తలేరు.. ఎందుకంటె ఫ్రెండ్లీ గవర్నమెంటు అన్నం కాబట్టి మా సీఐగారు, మా డీఎస్పీగారు, మా ఎస్సైలు అంతా ఊకే నిలబడ్డారు. బొక్కలిరిసి కుప్ప పెడుత నేనే.. ఇగ ఊర్కునే ’ అంటూ హెచ్చరించారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండిలో జరిగిన రెండోదశ మిషన్ కాకతీయ సందర్భంగా కుడిచెరువు పునురద్ధరణ పనుల ప్రారంభోత్సవంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కుడి చెరువును మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేయాలంటూ విపక్షాలు, చొప్పదండి గ్రామస్తులు కలిసి వచ్చారు. మంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఇంతలో జోక్యం చేసుకున్న మహిళా ఎమ్మెల్యే వినతిపత్రం మాత్రమే ఇవ్వాలని, ఏమీ మాట్లాడకుండా వెంటనే వేదిక దిగాలని వార్నింగ్ ఇచ్చారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News