నేను క్షమాపణ చెబుతున్నా... ఇంకా కోపం ఉంటే వచ్చి — తో కొట్టండి

నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ వైసీపీని వీడి టీడీపీలో చేరడంపై నెల్లూరు జిల్లా వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.  జగన్‌ను కోరి సునీల్‌కు టికెట్ ఇప్పించింది తానేనని అయితే అతడు ఇంత దారుణంగా వెన్నుపోటు పొడుస్తాడని ఊహించలేదన్నారు. సునీల్ చేసిన పనికి తాను తలెత్తుకోలేకపోతున్నానని అన్నారు. సునీల్ పార్టీ వీడడం వెనుక తన హస్తం లేదన్నారు. నెల్లూరులో రాజరాజేశ్వరి దేవి, సూళ్లూరుపేట చెంగాలమ్మ, రామతీర్థం శివుడిపై ప్రమాణం […]

Advertisement
Update: 2016-04-15 02:14 GMT

నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ వైసీపీని వీడి టీడీపీలో చేరడంపై నెల్లూరు జిల్లా వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ను కోరి సునీల్‌కు టికెట్ ఇప్పించింది తానేనని అయితే అతడు ఇంత దారుణంగా వెన్నుపోటు పొడుస్తాడని ఊహించలేదన్నారు. సునీల్ చేసిన పనికి తాను తలెత్తుకోలేకపోతున్నానని అన్నారు. సునీల్ పార్టీ వీడడం వెనుక తన హస్తం లేదన్నారు. నెల్లూరులో రాజరాజేశ్వరి దేవి, సూళ్లూరుపేట చెంగాలమ్మ, రామతీర్థం శివుడిపై ప్రమాణం చేసి చెబుతున్నానని… ఒకవేళ సునీల్‌ పార్టీ వీడడం వెనుక తన ప్రమేయం ఉంటే తన కుటుంబం సర్వనాశనం అయిపోతుందన్నారు.

సునీల్‌ చాలా మంది వర్కర్‌ అని జగన్‌కు తానే ఎన్నోసార్లు చెప్పానన్నారు. కానీ తనకు తీరని మోసం చేసి సునీల్ వెళ్లిపోయారన్నారు. తమ కుటుంబానికి ఏదో శాపం ఉందని అందుకే ఇలాంటి వెన్నుపోట్లు తమ కుటుంబానికే పదేపదే ఎదురవుతున్నాయన్నారు. జగన్‌ను ఒప్పించి సునీల్‌కు గూడూరు టికెట్ ఇప్పించిందని తానేనని కాబట్టి… గూడూరు ప్రజలకు సునీల్ చేసిన మోసానికి తాను క్షమాపణ చెబుతున్నానని ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. ఒకవేళ ప్రజలకు ఇంకా కోపం తగ్గకపోతే సునీల్‌కు టికెట్ ఇప్పించిన తనను గూడూరు ప్రజలు చెప్పుతో కొట్టినా భరిస్తానన్నారు. సునీల్ ఇంత దెబ్బకొడుతారని అనుకోలేదని… సిగ్గుతో తాను తలదించుకుంటున్నానని అన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News