క్షమాపణ చెప్పలేదు... వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా…

తనను కించపరిచారంటూ  టీడీపీ ఎమ్మెల్యే అనిత చేసిన ఫిర్యాదు విషయంపై అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ముందు వైసీపీ ఎమ్మెల్యే రోజా హాజరై వివరణ ఇచ్చారు. తాను అనితను కించపరిచేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు.  ఒకవేళ తన వ్యాఖ్యలు కించపరిచినట్టుగా ఉన్నాయని అనిత భావించి ఉంటే వాటిని ఉపసంహరించుకునేందుకు అభ్యంతరం లేదని రోజా చెప్పారు. వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటానని చెప్పానని… క్షమాపణ చెప్పలేదని రోజా మీడియాతో చెప్పారు.  తాను ఎలాంటి తప్పు చేయకపోయినా బలి పశువును చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రోజా […]

Advertisement
Update: 2016-04-06 05:43 GMT

తనను కించపరిచారంటూ టీడీపీ ఎమ్మెల్యే అనిత చేసిన ఫిర్యాదు విషయంపై అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ముందు వైసీపీ ఎమ్మెల్యే రోజా హాజరై వివరణ ఇచ్చారు. తాను అనితను కించపరిచేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఒకవేళ తన వ్యాఖ్యలు కించపరిచినట్టుగా ఉన్నాయని అనిత భావించి ఉంటే వాటిని ఉపసంహరించుకునేందుకు అభ్యంతరం లేదని రోజా చెప్పారు.

వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటానని చెప్పానని… క్షమాపణ చెప్పలేదని రోజా మీడియాతో చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా బలి పశువును చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రోజా అన్నారు. మహిళ ఎమ్మెల్యే అయిన అనితపై తమకు గౌరవం ఉందన్నారు. టీడీపీ సభ్యులు తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారని … వాటిపై తాము కూడా ఫిర్యాదు చేశామన్నారు. ఆ ఫిర్యాదులపైనా విచారణ జరపాల్సిందిగా ప్రివిలేజ్ కమిటీని కోరినట్టు రోజా చెప్పారు. రోజా వివరణను రికార్డు చేసుకున్నామని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు చెప్పారు. మరోసారి కమిటీ సభ్యులు సమావేశమై తుది నివేదికను స్పీకర్‌కు సమర్పిస్తామన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News