శిల్పా అనుచరుడిపై వేటకొడవళ్లతో దాడి, భూమాపై ఫిర్యాదుకు సిద్ధం

కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీలో కలకలం రేగింది. ఇటీవల భూమానాగిరెడ్డి టీడీపీలో చేరిన తర్వాత శిల్పా, భూమ వర్గీయుల మధ్య అంతర్గతపోరు నడుస్తోంది. తాజాగా శిల్పామోహన్‌ రెడ్డి ప్రధాన అనుచరుడు, టీడీపీ నేత తులసిరెడ్డిపై దాడి జరిగింది. ప్రత్యర్థులు గతరాత్రి తులసిరెడ్డి కళ్లలో కారం చల్లి అనంతరం వేటకొడవళ్లతో నరికారు.  రాత్రి పదిన్నర సమయంలో దాడి జరిగింది. తులసిరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆయన్ను హైదరాబాద్ తరలించారు. భూమానాగిరెడ్డి అనుచరులే ఈ దాడి చేశారని బాధితుడి కుటుంబసభ్యులు  మీడియా […]

Advertisement
Update: 2016-03-28 22:38 GMT

కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీలో కలకలం రేగింది. ఇటీవల భూమానాగిరెడ్డి టీడీపీలో చేరిన తర్వాత శిల్పా, భూమ వర్గీయుల మధ్య అంతర్గతపోరు నడుస్తోంది. తాజాగా శిల్పామోహన్‌ రెడ్డి ప్రధాన అనుచరుడు, టీడీపీ నేత తులసిరెడ్డిపై దాడి జరిగింది. ప్రత్యర్థులు గతరాత్రి తులసిరెడ్డి కళ్లలో కారం చల్లి అనంతరం వేటకొడవళ్లతో నరికారు. రాత్రి పదిన్నర సమయంలో దాడి జరిగింది. తులసిరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది.

దీంతో ఆయన్ను హైదరాబాద్ తరలించారు. భూమానాగిరెడ్డి అనుచరులే ఈ దాడి చేశారని బాధితుడి కుటుంబసభ్యులు మీడియా ముందు ఆరోపించారు. నంద్యాల టీడీపీలో ఆధిప్యతం కోసం భూమా తిరిగి ఈ తరహా దాడులు మొదలుపెట్టారని మండిపడ్డారు. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని శిల్పామోహన్ రెడ్డి చెప్పారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News