కామెడీ నైట్స్ క‌పిల్ శ‌ర్మ‌...మోడీ స‌ర‌స‌న‌!

అంత‌ర్జాతీయ మైన‌పు విగ్ర‌హాల మ్యూజియం మేడ‌మ్ టుస్సాడ్స్‌లో భార‌త‌ ప్ర‌ధాని మోడీ విగ్ర‌హం కూడా చేర‌నున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌తో పాటు కామెడీ నైట్స్ విత్ క‌పిల్… టివి ప్రోగ్రాంతో ఫేమ‌స్ అయిన క‌పిల్ శ‌ర్మ విగ్ర‌హం కూడా టూస్సాడ్స్‌లో నెల‌కొల్ప‌నున్నారు. ఒక ఎంట‌ర్‌టైన్‌మెంట్ వైబ్‌సైట్ అందిస్తున్న స‌మాచారం మేర‌కు, మోడీ ఫొటోలు, శరీర కొల‌త‌లను తీసుకుంటున్న టుస్సాడ్స్‌ మ్యూజియం బృంద‌మే క‌పిల్ శ‌ర్మ శ‌రీర కొల‌త‌లు, ఫొటోల‌ను కూడా సేక‌రించ‌నుంద‌ని స‌మాచారం. దీంతో ఆయ‌న ఈ […]

Advertisement
Update: 2016-03-18 00:06 GMT

అంత‌ర్జాతీయ మైన‌పు విగ్ర‌హాల మ్యూజియం మేడ‌మ్ టుస్సాడ్స్‌లో భార‌త‌ ప్ర‌ధాని మోడీ విగ్ర‌హం కూడా చేర‌నున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌తో పాటు కామెడీ నైట్స్ విత్ క‌పిల్… టివి ప్రోగ్రాంతో ఫేమ‌స్ అయిన క‌పిల్ శ‌ర్మ విగ్ర‌హం కూడా టూస్సాడ్స్‌లో నెల‌కొల్ప‌నున్నారు. ఒక ఎంట‌ర్‌టైన్‌మెంట్ వైబ్‌సైట్ అందిస్తున్న స‌మాచారం మేర‌కు, మోడీ ఫొటోలు, శరీర కొల‌త‌లను తీసుకుంటున్న టుస్సాడ్స్‌ మ్యూజియం బృంద‌మే క‌పిల్ శ‌ర్మ శ‌రీర కొల‌త‌లు, ఫొటోల‌ను కూడా సేక‌రించ‌నుంద‌ని స‌మాచారం. దీంతో ఆయ‌న ఈ మ్యూజియంలో స్థానం సంపాదించిన మొట్ట‌మొద‌టి భార‌తీయ‌ టివి క‌ళాకారుడిగా గుర్తింపు పొందుతారు. క‌పిల్ శ‌ర్మ విగ్ర‌హాల త‌యారీకి ఆరునెల‌ల కాలం ప‌డుతుంద‌ని తెలుస్తోంది. మేడ‌మ్ టుస్సాడ్స్‌లో ఇప్ప‌టికే అమితాబ్ బ‌చ్చ‌న్‌, షారుక్‌ఖాన్‌, క‌త్రినాకైఫ్‌, క‌రీనా క‌పూర్‌, మాధురీ దీక్షిత్ లాంటి భార‌తీయ సెల‌బ్రిటీల మైన‌పు బొమ్మ‌లు ఉన్నాయి. క‌పిల్ శ‌ర్మ‌కి ద‌క్కిన ఈ అవ‌కాశంపై ప్ర‌శంస‌ల‌తో పాటు విమ‌ర్శ‌లూ వినిపిస్తున్నాయి. ఆయ‌న‌కంటే గొప్ప క‌ళాకారులు ఎంతోమంది మ‌న‌దేశంలో ఉన్నార‌నే విమ‌ర్శ‌లు ఆన్‌లైన్లో క‌నిపిస్తున్నాయి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News