అసెంబ్లీలో బాలయ్య చిట్‌ చాట్, అమావాస్య వెళ్లాక అన్నీ చెబుతా!

అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిట్‌ చాట్ చేశారు.  తన వందో సినిమాపై స్పందించారు. రెండు కథలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.   కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు,  క్రిష్ దర్శకత్వంలో గౌతమీపుత్ర శాతకర్ణి కథలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ రెండింటిలో ఏది ముందుగా  తీయాలన్న దానిపై అమావాస్య వెళ్లాక నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.  వచ్చే ఏడాది ఆదిత్య 369 సీక్వెల్ ఉంటుందన్నారు. అదే ఏడాది కుమారుడు మోక్షజ్ఞను సినిమాల్లోకి తెస్తానన్నారు. ఆదిత్య సీక్వెల్‌లో తాను , […]

Advertisement
Update: 2016-03-07 23:49 GMT

అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిట్‌ చాట్ చేశారు. తన వందో సినిమాపై స్పందించారు. రెండు కథలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు, క్రిష్ దర్శకత్వంలో గౌతమీపుత్ర శాతకర్ణి కథలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ రెండింటిలో ఏది ముందుగా తీయాలన్న దానిపై అమావాస్య వెళ్లాక నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. వచ్చే ఏడాది ఆదిత్య 369 సీక్వెల్ ఉంటుందన్నారు. అదే ఏడాది కుమారుడు మోక్షజ్ఞను సినిమాల్లోకి తెస్తానన్నారు. ఆదిత్య సీక్వెల్‌లో తాను , మోక్షజ్ఞ కలిసి నటిస్తున్నట్టు బాలకృష్ణ చెప్పారు. లేపాక్షిని అంతర్జాతీయ వారసత్వ కేంద్రంగా గుర్తించాలని యునెస్కోకు లేఖ రాశానని బాలకృష్ణ వెల్లడించారు.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News