కిడ్నీలు జాగ్రత్త…

పంచ్‌ డైలాగు పేల్చాడు రేవంత్‌. మరోసారి కేసీఆర్‌పై సెటైర్లు వేశారు. వరంగల్‌లో జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న రేవంత్  …టీఆర్ఎస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావులతో కూడిన దుష్టచతుష్టయం ఉందని… ఇప్పుడు వరంగల్‌లోనూ కడియం, ఎర్రబెల్లి, కొండా మురళీ, వినయ్‌ భాస్కర్‌ లతో దుష్టచతుష్టయం ఏర్పడిందన్నారు.  కడియం, ఎర్రబెల్లి ఒకటయ్యారని ఇక కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కేసీఆర్ ఆదమరిచి నిద్రపోతే కిడ్నీలను మాయం చేసేస్తారని హెచ్చరించారు.  టీడీపీ కార్యకర్తల […]

Advertisement
Update: 2016-02-28 03:02 GMT

పంచ్‌ డైలాగు పేల్చాడు రేవంత్‌. మరోసారి కేసీఆర్‌పై సెటైర్లు వేశారు. వరంగల్‌లో జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న రేవంత్ …టీఆర్ఎస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావులతో కూడిన దుష్టచతుష్టయం ఉందని… ఇప్పుడు వరంగల్‌లోనూ కడియం, ఎర్రబెల్లి, కొండా మురళీ, వినయ్‌ భాస్కర్‌ లతో దుష్టచతుష్టయం ఏర్పడిందన్నారు. కడియం, ఎర్రబెల్లి ఒకటయ్యారని ఇక కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

కేసీఆర్ ఆదమరిచి నిద్రపోతే కిడ్నీలను మాయం చేసేస్తారని హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తల శ్రమతో గెలిచిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. హరీష్‌ రావువి అన్నీ ఉడత ఊపులేనని… తెలంగాణలో టీడీపీని లేకుండా చేయడం ఆయన వల్ల అయ్యే పనికాదన్నారు. వరంగల్ ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా పోరాడాలని పార్టీ శ్రేణులకు రేవంత్ పిలుపునిచ్చారు.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News