టీడీపీకి గుడ్‌ బై చెప్పిన ఎమ్మెల్యే, దారిలో మరొకరు

గ్రేటర్‌ ఎన్నికల షాక్‌ నుంచి కోలుకోకముందే టీటీడీపీకి మరో షాక్ తగిలింది. కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా లేఖను టీడీపీ నాయకత్వానికి పంపారు. వివేకానందను ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ ఎమ్మెల్యే మాధవరపు కృష్ణారావు సీఎం కేసీఆర్ వద్దకు తీసుకొచ్చారు. చాలాకాలంగా వివేక పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది. వివేకనంద దారిలోనే మరొక టీడీపీ ఎమ్మెల్యే కూడా కారెక్కేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీకి మనుగడ లేదన్న […]

Advertisement
Update: 2016-02-08 23:23 GMT

గ్రేటర్‌ ఎన్నికల షాక్‌ నుంచి కోలుకోకముందే టీటీడీపీకి మరో షాక్ తగిలింది. కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా లేఖను టీడీపీ నాయకత్వానికి పంపారు. వివేకానందను ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ ఎమ్మెల్యే మాధవరపు కృష్ణారావు సీఎం కేసీఆర్ వద్దకు తీసుకొచ్చారు. చాలాకాలంగా వివేక పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది. వివేకనంద దారిలోనే మరొక టీడీపీ ఎమ్మెల్యే కూడా కారెక్కేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీకి మనుగడ లేదన్న నిర్ధారణకు రావడం వల్లే టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నట్టు తెలుస్తోంది.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News