బాబు జబ్బుకు వైద్యం చేయించండి " కాపులకు మేలు చేయండి

కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం దంపతుల అమరణ దీక్ష మూడో రోజుకు చేరింది. ఆయన ఇంటి వద్దకు కాపులు పెద్దెత్తున చేరుకుంటున్నారు. అయితే పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.   సీఎం, కాపు మంత్రులు, టీడీపీ కాపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.   మరోవైపు ముద్రగడ తన ఇంటి లోపల తలుపులు వేసుకున్నారు. రిజర్వేషన్లపై ప్రభుత్వం దిగి వచ్చే వరకు వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. చంద్రబాబు మొండి […]

Advertisement
Update: 2016-02-07 01:17 GMT

కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం దంపతుల అమరణ దీక్ష మూడో రోజుకు చేరింది. ఆయన ఇంటి వద్దకు కాపులు పెద్దెత్తున చేరుకుంటున్నారు. అయితే పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం, కాపు మంత్రులు, టీడీపీ కాపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. మరోవైపు ముద్రగడ తన ఇంటి లోపల తలుపులు వేసుకున్నారు.

రిజర్వేషన్లపై ప్రభుత్వం దిగి వచ్చే వరకు వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. చంద్రబాబు మొండి అయితే తాను జగమొండి అని అన్నారు. రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్లకు చంద్రబాబు ఎలా ఎదిగారో చెప్పాలని ముద్రగడ డిమాండ్ చేశారు. రెండు లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఎలా విస్తరించారో చెప్పాలన్నారు. ఆ రహస్యం ఒకటి చెబితే దేశంలో ఎవరికీ రిజర్వేషన్లు అవసరం ఉండదన్నారు. తాను కూడా వెంటనే దీక్ష విరమిస్తానన్నారు. తాను కూడా రెండు లక్షల కోట్లు సంపాదించుకుని తన జాతికి ఆ సొమ్ముతో మంచిచేస్తానన్నారు.

తనకు ఆరోగ్యం బాగానే ఉందన్నారు. చంద్రబాబుకే ఆరోగ్యం బాగోలేదని అందుకే అన్ని మరిచిపోతున్నారన్నారు. కాబట్టి డాక్టర్లు వెళ్లి చంద్రబాబుకే వైద్యం చేయాలని ముద్రగడ సూచించారు. చికిత్స చేసి చంద్రబాబుకు తానిచ్చిన హామీలు గుర్తుకు వచ్చేలా చేయాలన్నారు. మరోవైపు ముద్రగడకు మద్దతుగా రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News