కాపు గర్జనలో ఉద్రిక్తత- రైళ్లపై రాళ్ల దాడి

#ఆందోళన విరమించిన ముద్రగడ- సోమవారం సాయంత్రం వరకు గడువు# కాపు గర్జనలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసులు, ఇంటెలిజెన్స్ కూడా పసిగట్టలేని పరిణామాలు చోటుకున్నాయి. సభ నుంచి కాపులు నేరుగా రైలు పట్టాలపైకి వెళ్లి ఆందోళనకు దిగారు. రహదారిని స్తంభింపజేశారు. కొందరు రైళ్లపైకి రాళ్లు రువ్వారు. తుని రైల్వేస్టేషన్‌ సమీపంలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు రువ్వారు. రైలు ఇంజిన్ ధ్వంసం చేశారు. దాడిలో పలువురు రైల్వే సిబ్బందికి గాయాలయ్యాయి.  రాత్రి ముద్రగడ ఆందోళన విరమించారు. సోమవారం […]

Advertisement
Update: 2016-01-31 04:44 GMT

#ఆందోళన విరమించిన ముద్రగడ- సోమవారం సాయంత్రం వరకు గడువు#

కాపు గర్జనలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసులు, ఇంటెలిజెన్స్ కూడా పసిగట్టలేని పరిణామాలు చోటుకున్నాయి. సభ నుంచి కాపులు నేరుగా రైలు పట్టాలపైకి వెళ్లి ఆందోళనకు దిగారు. రహదారిని స్తంభింపజేశారు. కొందరు రైళ్లపైకి రాళ్లు రువ్వారు. తుని రైల్వేస్టేషన్‌ సమీపంలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు రువ్వారు. రైలు ఇంజిన్ ధ్వంసం చేశారు. దాడిలో పలువురు రైల్వే సిబ్బందికి గాయాలయ్యాయి. రాత్రి ముద్రగడ ఆందోళన విరమించారు. సోమవారం సాయంత్రం లోపు రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన చేయకుంటే అమరణ దీక్షకు దిగుతానని ప్రకటించారు.

Click on Image to Read

Tags:    
Advertisement

Similar News