ఎవరికో భయపడి వారితో స్నేహం వదులుకోను!

ఏపీలో కాంగ్రెస్ కూప్పకూలిపోవడంతో టీడీపీలో చేరినప్పటికీ  సొంత అభిప్రాయలు మార్చుకునేందుకు జేసీ బ్రదర్స్ సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు.  తాజాగా ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తనకు వైసీపీ, కాంగ్రెస్ నేతలతో బంధుత్వాలు, స్నేహాలు ఉన్నాయని చెప్పారు. అవి మునుముందు కూడా కొనసాగుతాయని స్పష్టం చేశారు. బంధుత్వం, స్నేహం వల్ల వైసీపీ నేతలు తనను కలుస్తుంటారని చెప్పారు. ఎవరికో భయపడి వారితో మాట్లాడకుండా ఉండే రకం తాను కాదన్నారు. మొన్నటి ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు కాబట్టి చంద్రబాబుకు మాత్రమే […]

Advertisement
Update: 2016-01-27 22:40 GMT

ఏపీలో కాంగ్రెస్ కూప్పకూలిపోవడంతో టీడీపీలో చేరినప్పటికీ సొంత అభిప్రాయలు మార్చుకునేందుకు జేసీ బ్రదర్స్ సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. తాజాగా ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తనకు వైసీపీ, కాంగ్రెస్ నేతలతో బంధుత్వాలు, స్నేహాలు ఉన్నాయని చెప్పారు. అవి మునుముందు కూడా కొనసాగుతాయని స్పష్టం చేశారు. బంధుత్వం, స్నేహం వల్ల వైసీపీ నేతలు తనను కలుస్తుంటారని చెప్పారు. ఎవరికో భయపడి వారితో మాట్లాడకుండా ఉండే రకం తాను కాదన్నారు. మొన్నటి ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు కాబట్టి చంద్రబాబుకు మాత్రమే తాను విధేయుడినని.. తెలుగుదేశం పార్టీకి కాదని మీడియాతో చెప్పారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి గొడవ చేసే సంస్కృతి మంచిది కాదన్నారు జేసీ.

Click on Image to Read

Tags:    
Advertisement

Similar News

ఇకపై TGPSC, TGRTC