రెడ్ల గొప్పదనం వివరించిన జేసీ

ఏ విషయానైనా నేరుగా బయటకు చెప్పే తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో రెడ్డి సంక్షేమసంఘం ఆధ్వర్యంలో జరిగిన యోగి వేమన జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభాకర్ రెడ్డి… రెడ్లు దానగుణ సంపన్నులన్నారు. ఆ పేరును నిలబెట్టుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పరోపకారం ద్వారానే రెడ్డి కులస్తులు… ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆదరణ పొందగలుగుతున్నారని వ్యాఖ్యానించారు. మునుముందు కూడా ఇదే ధోరణితో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.  కార్యక్రమానికి హాజరైన […]

Advertisement
Update: 2016-01-25 02:32 GMT

ఏ విషయానైనా నేరుగా బయటకు చెప్పే తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో రెడ్డి సంక్షేమసంఘం ఆధ్వర్యంలో జరిగిన యోగి వేమన జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభాకర్ రెడ్డి… రెడ్లు దానగుణ సంపన్నులన్నారు. ఆ పేరును నిలబెట్టుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పరోపకారం ద్వారానే రెడ్డి కులస్తులు… ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆదరణ పొందగలుగుతున్నారని వ్యాఖ్యానించారు. మునుముందు కూడా ఇదే ధోరణితో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమానికి హాజరైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి … కులంలోని పేదల సహాయార్ధం నిధిని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నిధిని జేసీ దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించాలని నిధిని తన వంతు విరాళంగా రూ. 5 లక్షలు ఇస్తున్నట్టు గురునాథ్ రెడ్డి ప్రకటించారు. రెడ్డి సంక్షేమ సంఘంలో మహిళలకు స్థానం కల్పించాలని కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి సూచించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News