దేశంలో ఉగ్రకలకలం

దేశంలో మరోసారి ఉగ్రవాదులు అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. పఠాన్‌కోట్‌ నుంచి ముగ్గురు ఉగ్రవాదులు ఢిల్లీలోకి చొరబడినట్టు అనుమానిస్తున్నారు. తొలుత క్యాబ్‌లో బయలుదేరిన ఉగ్రవాదులు క్యాబ్‌ డ్రైవర్‌ను హత్య చేశారు. అదే క్యాబ్‌లో ఉగ్రవాదులు చొరబడినట్టు ఐబీ భావిస్తోంది. ఢిల్లీలో సోదాలు ముమ్మరం చేశారు. అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీవాసులను పోలీసులు హెచ్చరించారు. దేశ వ్యాప్తంగానూ హైఅలర్ట్ ప్రకటించారు. మరోవైపు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలో పలువురు అనుమానితులను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. బెంగళూరులో ఆరుగురు. ఢిల్లీలో ముగ్గురు, […]

Advertisement
Update: 2016-01-21 21:30 GMT

దేశంలో మరోసారి ఉగ్రవాదులు అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. పఠాన్‌కోట్‌ నుంచి ముగ్గురు ఉగ్రవాదులు ఢిల్లీలోకి చొరబడినట్టు అనుమానిస్తున్నారు. తొలుత క్యాబ్‌లో బయలుదేరిన ఉగ్రవాదులు క్యాబ్‌ డ్రైవర్‌ను హత్య చేశారు. అదే క్యాబ్‌లో ఉగ్రవాదులు చొరబడినట్టు ఐబీ భావిస్తోంది. ఢిల్లీలో సోదాలు ముమ్మరం చేశారు. అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీవాసులను పోలీసులు హెచ్చరించారు. దేశ వ్యాప్తంగానూ హైఅలర్ట్ ప్రకటించారు. మరోవైపు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలో పలువురు అనుమానితులను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. బెంగళూరులో ఆరుగురు. ఢిల్లీలో ముగ్గురు, హైదరాబాద్‌లో నలుగురు అనుమానితులను ఎన్‌ఐఏ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News