రాయపాటిని తిట్టిన చంద్రబాబు... అడవిలో పడేశారని ఆవేదన

నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పదేపదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న రాయపాటి ఈసారి చంద్రబాబును ఉద్దేశించి కామెంట్స్ చేశారు. టీడీపీలో తాను ఇమడలేకపోతున్నానని బహిరంగవేదికపైనే చెప్పారు. అంతటితో ఆగలేదు. చంద్రబాబు తనను తిడుతున్నారని ఆవేదన చెందారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో జరిగిన ఓ పాఠశాల స్వర్ణోత్సవ సంబరాల్లో రాయపాటి ఈ వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో తాగు నీటి సమస్య పరిష్కారం కోసం వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు తాను సిద్ధమైతే చంద్రబాబు […]

Advertisement
Update: 2016-01-14 23:00 GMT

నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పదేపదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న రాయపాటి ఈసారి చంద్రబాబును ఉద్దేశించి కామెంట్స్ చేశారు. టీడీపీలో తాను ఇమడలేకపోతున్నానని బహిరంగవేదికపైనే చెప్పారు. అంతటితో ఆగలేదు. చంద్రబాబు తనను తిడుతున్నారని ఆవేదన చెందారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో జరిగిన ఓ పాఠశాల స్వర్ణోత్సవ సంబరాల్లో రాయపాటి ఈ వ్యాఖ్యలు చేశారు.

నియోజకవర్గంలో తాగు నీటి సమస్య పరిష్కారం కోసం వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు తాను సిద్ధమైతే చంద్రబాబు మాత్రం డబ్బులు లేవన్నారని రాయపాటి చెప్పారు. ఢిల్లీతో సంబంధాలు అంటీముట్టనట్టుగా ఉన్నాయని… నిధుల కోసం కేంద్రాన్ని గట్టిగా ఆడిగితే చంద్రబాబు తనను దొబ్బేస్తున్నారని బయటపెట్టారు. అసలు టీడీపీలో తాను ఇమడలేకపోతున్నానని చెప్పారు. ఇన్నాళ్లు ఈ పార్టీలో ఎలా ఉన్నారంటూ వేదికపైనే ఉన్న మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్యను ఉద్దేశించి రాయపాటి అన్నారు. చంద్రబాబు తనను అడవుల్లో పడేశారని అన్నారు. రాయపాటి వ్యాఖ్యలతో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. మొత్తం మీద రాయపాటి టీడీపీలో మరోదారి లేక ఉంటున్నారన్న విషయం ఆయన వ్యాఖ్యలతో అర్థమైందంటున్నారు.

Click to Read:

Tags:    
Advertisement

Similar News