టీడీపీలో గూఢచర్య కలకలం- ప్రైవేట్ డిటెక్టివ్స్‌కు పని అప్పగింత

టీడీపీలో గూఢచర్యం కలకలం రేపుతోంది. సొంత పార్టీ నేతలనే కేంద్ర మంత్రి గూడచర్యానికి పాల్పడ్డారని ఎన్టీఆర్ భవన్‌లో చర్చ జరుగుతోంది. కేంద్రమంత్రి పేరు రాయకపోయినా ఒక ప్రముఖ దిన పత్రిక కూడా ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించింది. సదరు కేంద్రమంత్రి సుజనా చౌదరేనని టీడీపీ నేతలు చెబుతున్నారు. తనకు సంబంధించిన వ్యాపార వివరాలు ప్రధాని కార్యాలయంతో పాటు ఈడీ వంటి దర్యాప్తు సంస్థలకు ఎప్పటికప్పుడు అందుతుండడంతో అనుమానపడ్డ కేంద్ర మంత్రి ఈ పనిచేస్తున్నట్టు చెబుతున్నారు. ఇందుకోసం దేశంలో […]

Advertisement
Update: 2016-01-06 01:29 GMT

టీడీపీలో గూఢచర్యం కలకలం రేపుతోంది. సొంత పార్టీ నేతలనే కేంద్ర మంత్రి గూడచర్యానికి పాల్పడ్డారని ఎన్టీఆర్ భవన్‌లో చర్చ జరుగుతోంది. కేంద్రమంత్రి పేరు రాయకపోయినా ఒక ప్రముఖ దిన పత్రిక కూడా ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించింది. సదరు కేంద్రమంత్రి సుజనా చౌదరేనని టీడీపీ నేతలు చెబుతున్నారు. తనకు సంబంధించిన వ్యాపార వివరాలు ప్రధాని కార్యాలయంతో పాటు ఈడీ వంటి దర్యాప్తు సంస్థలకు ఎప్పటికప్పుడు అందుతుండడంతో అనుమానపడ్డ కేంద్ర మంత్రి ఈ పనిచేస్తున్నట్టు చెబుతున్నారు. ఇందుకోసం దేశంలో పేరొందిన ప్రైవేట్ డిటెక్టివ్‌ ఏజెన్సీలను సంప్రదించారట. అయితే తనకు వ్యతిరేకంగా ఈ నివేదికలు అందజేస్తున్నది ప్రతిపక్ష పార్టీ కాదన్న నిర్ధారణకు వచ్చిన కేంద్రమంత్రి… ఇప్పుడు సొంత పార్టీ నేతలపైనే నిఘా పెట్టించారని సమాచారం.

కేంద్రమంత్రి నిఘాలో ఉన్న వారి పేర్లను కూడా చెబుతున్నారు. ఆర్థిక వ్యవహారాల్లో లోటుపాపట్లు కారణంగా తన మంత్రి పదవి ఊడితే … ఆ స్థానాన్ని ఎవరు ఆశిస్తున్నారన్న కోణంలో డిటెక్టివ్‌ సంస్థ ద్వారా కూపీ లాగుతున్నారు. టీడీపీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు, టీడీపీకి అత్యంత అనుకూలంగా పనిచేస్తున్న ఒక మీడియా సంస్థ అధినేత, ఢిల్లీలో ఏపీ వ్యవహారాలను చక్కబెడుతున్న మరో టీడీపీ నేతపై నిఘా పెట్టించారని చెబుతున్నారు. తన సంస్థలకు సంబంధించిన ఆర్ధిక విషయాలను సదరు నేతలు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు.. వాటిని ఎవరి ద్వారా దర్యాప్తు సంస్థలకు చేరవేస్తున్నారు అన్న దానిని కనిపెట్టే పనిని డిటెక్టివ్ సంస్థకు అప్పగించారట కేంద్రమంత్రి. ఈ విషయం నిఘాను ఎదుర్కొంటున్న సదరు వ్యక్తులకు కూడా తెలిసిందని చెబుతున్నారు. వారు కేంద్ర మంత్రిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారని సమాచారం. మొత్తం మీద ఇలా కీలక నేతలు ఒకరి గోతులు మరొకరు తవ్వుకుంటుండడం టీడీపీలో కలకలం రేపుతోంది.

Tags:    
Advertisement

Similar News