అప్పుడు నా ఓటు బీజేపీకే

గ్రేటర్ ఎన్నికల వేళ సవాళ్లు ప్రతిసవాళ్లు మొదలయ్యాయి. టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత కూడా బీజేపీ నేతలకు ఒక సవాల్ విసిరారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి రూ. 20 వేల కోట్ల ప్యాకేజ్‌ను బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి తీసుకువస్తే తాను కూడా బీజేపీకే ఓటేస్తానని కవిత అన్నారు. ఈ సవాల్‌ను బీజేపీ నేతలు స్వీకరించాలన్నారు. తన తండ్రి కేసీఆర్‌ను భోళా శంకురుడితో పోల్చారామె. కేసీఆర్ భోళా శంకురుడి వంటి వారని అడిగినవన్నీ ఇచ్చేస్తారన్నారు. గ్రేటర్‌ పరిధిలోని […]

Advertisement
Update: 2016-01-04 12:00 GMT

గ్రేటర్ ఎన్నికల వేళ సవాళ్లు ప్రతిసవాళ్లు మొదలయ్యాయి. టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత కూడా బీజేపీ నేతలకు ఒక సవాల్ విసిరారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి రూ. 20 వేల కోట్ల ప్యాకేజ్‌ను బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి తీసుకువస్తే తాను కూడా బీజేపీకే ఓటేస్తానని కవిత అన్నారు. ఈ సవాల్‌ను బీజేపీ నేతలు స్వీకరించాలన్నారు. తన తండ్రి కేసీఆర్‌ను భోళా శంకురుడితో పోల్చారామె. కేసీఆర్ భోళా శంకురుడి వంటి వారని అడిగినవన్నీ ఇచ్చేస్తారన్నారు. గ్రేటర్‌ పరిధిలోని పేదలకు ప్రాంతాలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయని కవిత చెప్పారు.

Tags:    
Advertisement

Similar News