రాందేవ్‌ ఉత్పత్తులపై ముస్లిం సంస్థల నిషేధం

యోగా గురువు బాబా రాందేవ్‌ సొంత కంపెనీ పతంజలి ఉత్పత్తులకు వ్యతిరేకంగా తమిళనాడులో ముస్లిం మత పెద్దలు ఫత్వా జారీ చేశారు. పతంజలి ఉత్పత్తుల్లో ఆవు మూత్రం కలుపుతారని కాబట్టి వాటిని వాడవద్దని తమ మతస్తులకు సూచించారు. రాందేవ్‌ సంస్థకు చెందిన ఆహార ఉత్పత్తులను కూడా వాడవద్దని ఫత్వా జారీ చేశారు. పతంజలి ఉత్పత్తుల్లో గోమూత్రం కలుపుతున్న విషయం తెలియక ముస్లిం ప్రజలు వాటిని వాడుతున్నారని అందుకే ఆయా ఉత్పత్తులపై ఫత్వా జారీ చేస్తున్నట్టు తమిళనాడు తౌహిద్ […]

Advertisement
Update: 2015-12-29 12:05 GMT

యోగా గురువు బాబా రాందేవ్‌ సొంత కంపెనీ పతంజలి ఉత్పత్తులకు వ్యతిరేకంగా తమిళనాడులో ముస్లిం మత పెద్దలు ఫత్వా జారీ చేశారు. పతంజలి ఉత్పత్తుల్లో ఆవు మూత్రం కలుపుతారని కాబట్టి వాటిని వాడవద్దని తమ మతస్తులకు సూచించారు. రాందేవ్‌ సంస్థకు చెందిన ఆహార ఉత్పత్తులను కూడా వాడవద్దని ఫత్వా జారీ చేశారు. పతంజలి ఉత్పత్తుల్లో గోమూత్రం కలుపుతున్న విషయం తెలియక ముస్లిం ప్రజలు వాటిని వాడుతున్నారని అందుకే ఆయా ఉత్పత్తులపై ఫత్వా జారీ చేస్తున్నట్టు తమిళనాడు తౌహిద్ జమత్‌ వెల్లడించింది.

Tags:    
Advertisement

Similar News