వంగవీటి హత్యపై సాయిరెడ్డి కామెంట్స్

కాపునేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటిరంగా హత్యలో టీడీపీ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హస్తముందని వైసీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇప్పటికీ రంగా హత్య కేసులో ఏ -5గా వెలగపూడి ఉన్నారన్నారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ అరాచకాల గురించి ఎంత చెప్పినా తక్కువేనని సాయిరెడ్డి అన్నారు. రంగాను అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటనను ఇంకా రాష్ర్ట ప్రజలు మర్చిపోలేదన్నారు. తెలుగుదేశం హత్యా రాజకీయాలకు ఎమ్మెల్యే వెలగపూడి ప్రత్యక్ష నిదర్శనమని  దుయ్యబట్టారు. చంద్రబాబు పాలనపైనా విజయసాయిరెడ్డి […]

Advertisement
Update: 2015-12-22 22:23 GMT

కాపునేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటిరంగా హత్యలో టీడీపీ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హస్తముందని వైసీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇప్పటికీ రంగా హత్య కేసులో ఏ -5గా వెలగపూడి ఉన్నారన్నారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ అరాచకాల గురించి ఎంత చెప్పినా తక్కువేనని సాయిరెడ్డి అన్నారు. రంగాను అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటనను ఇంకా రాష్ర్ట ప్రజలు మర్చిపోలేదన్నారు. తెలుగుదేశం హత్యా రాజకీయాలకు ఎమ్మెల్యే వెలగపూడి ప్రత్యక్ష నిదర్శనమని దుయ్యబట్టారు.

చంద్రబాబు పాలనపైనా విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. మహిళా సాధికారిత అంటే మహిళ ఉద్యోగులను రోడ్డుమీదకు ఈడ్చి కొట్టడమా అని ప్రశ్నించారు. రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడమేనా మహిళా సాధికారిత అంటే అని సాయిరెడ్డి నిలదీశారు. కేంద్రంతో టీడీపీ కుమ్మకై జైలుకు పంపినా ప్రజల కోసం జగన్‌ వెనక్కు తగ్గలేదని అన్నారు.

Tags:    
Advertisement

Similar News