బాబు విషయాలు కేవీపీకి చేరవేసింది ఎవరు?

ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించి కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై కామెంట్స్ చేశారు. అది కూడా చంద్రబాబు సన్నిహితులే తనకు చెప్పారంటూ వెల్లడించారు. కేవీపీ చెబుతున్న దాని ప్రకారం చంద్రబాబుకు అల్జిమర్స్ వ్యాధి సోకిందట. ప్రస్తుతం చంద్రబాబుకు అల్జిమర్స్ ఆరంభదశలోనే ఉన్నట్టు తనకు తెలిసిందని కేవీపీ చెబుతున్నారు. దాని వల్ల ప్రాణహాని లేకపోయినా విషయాలను మరచిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయాలను చంద్రబాబు సన్నిహితులే కేవీపీకి చెప్పారట.అమరావతి నిర్మాణ తీరును […]

Advertisement
Update: 2015-12-21 02:22 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించి కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై కామెంట్స్ చేశారు. అది కూడా చంద్రబాబు సన్నిహితులే తనకు చెప్పారంటూ వెల్లడించారు. కేవీపీ చెబుతున్న దాని ప్రకారం చంద్రబాబుకు అల్జిమర్స్ వ్యాధి సోకిందట. ప్రస్తుతం చంద్రబాబుకు అల్జిమర్స్ ఆరంభదశలోనే ఉన్నట్టు తనకు తెలిసిందని కేవీపీ చెబుతున్నారు. దాని వల్ల ప్రాణహాని లేకపోయినా విషయాలను మరచిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయాలను చంద్రబాబు సన్నిహితులే కేవీపీకి చెప్పారట.అమరావతి నిర్మాణ తీరును తప్పుపడుతూ మాట్లాడిన సమయంలోనే కేవీపీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు చెబుతున్నారు. కేవీపీ కామెంట్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే కేవీపీ మామూలుగానే ఈ కామెంట్స్ చేశారా లేక నిజంగానే చంద్రబాబు సన్నిహితులు ఆయనతో ఈ విషయాలు చెప్పారా అన్నది ఆసక్తికరంగా ఉంది.click to read: రియల్‌ లైఫ్ విలన్లు

Tags:    
Advertisement

Similar News