పవన్‌ కంటే ముందుగానే మేల్కొన్న ఫ్యాన్స్

స్టేట్‌ను షేక్ చేస్తున్న కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై ఇప్పటి వరకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించలేదు. అన్ని పార్టీల నేతలు సెక్స్‌రాకెట్‌ ముఠాపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేస్తుండగా జనసేన అధ్యక్షుడు నోరు విప్పలేదు. అయితే సైలెంట్‌గా ఉంటే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించిన జనసేన కార్యకర్తలు పవన్‌ కంటే ముందుగానే మేల్కొన్నారు. విజయవాడలోని కాళేశ్వరరావు మార్కెట్ కూడలి వద్ద జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ధర్నా నిర్వహించారు. కాల్‌మనీ ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ […]

Advertisement
Update: 2015-12-18 02:05 GMT

స్టేట్‌ను షేక్ చేస్తున్న కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై ఇప్పటి వరకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించలేదు. అన్ని పార్టీల నేతలు సెక్స్‌రాకెట్‌ ముఠాపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేస్తుండగా జనసేన అధ్యక్షుడు నోరు విప్పలేదు. అయితే సైలెంట్‌గా ఉంటే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించిన జనసేన కార్యకర్తలు పవన్‌ కంటే ముందుగానే మేల్కొన్నారు. విజయవాడలోని కాళేశ్వరరావు మార్కెట్ కూడలి వద్ద జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ధర్నా నిర్వహించారు. కాల్‌మనీ ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాల్‌మనీ వ్యాపారులు స్వయంగా బయటకు వచ్చి తప్పులు ఒప్పుకుని బాధితులకు సొమ్ము తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ప్రామసరీ నోట్లు, ఆస్తుల పత్రాలను ముఠా సభ్యుల నుంచి విడిపించి బాధితులకు తిరిగిఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags:    
Advertisement

Similar News