విజయ్‌కాంత్‌పై పుకార్లు

తమిళనాడు డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ఆయన పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందంటూ తమిళనాడులో పుకార్లు షికార్లు చేశాయి. ఈ ప్రచారంతో చూసి కంగారుపడ్డ డీఎండీకే వెంటనే ప్రకటన విడుదల చేసింది. విజయకాంత్‌కు ఎలాంటి అస్వస్థత లేదని ఆరోగ్యంగానే ఉన్నారంటూ ప్రకటించింది. కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందవద్దని తెలిపింది. Click to Read: ‘నేషనల్ హెరాల్డ్’ కేసు గురించి సింపుల్‌గా చెప్పాలంటే ఎవరూ సృష్టించారో గానీ విజయకాంత్‌ ఐసీయూలో చికిత్స పొందుతున్నారని ఆయన ఏకంగా […]

Advertisement
Update: 2015-12-11 19:37 GMT

తమిళనాడు డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ఆయన పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందంటూ తమిళనాడులో పుకార్లు షికార్లు చేశాయి. ఈ ప్రచారంతో చూసి కంగారుపడ్డ డీఎండీకే వెంటనే ప్రకటన విడుదల చేసింది. విజయకాంత్‌కు ఎలాంటి అస్వస్థత లేదని ఆరోగ్యంగానే ఉన్నారంటూ ప్రకటించింది. కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందవద్దని తెలిపింది.

Click to Read: ‘నేషనల్ హెరాల్డ్’ కేసు గురించి సింపుల్‌గా చెప్పాలంటే

ఎవరూ సృష్టించారో గానీ విజయకాంత్‌ ఐసీయూలో చికిత్స పొందుతున్నారని ఆయన ఏకంగా కొన ఊపిరితో ఉన్నారంటూ తమిళనాడు మొత్తం శుక్రవారం పుకార్లు వ్యాపించాయి. డీఎండీకే కార్యాలయానికి వందలాది ఫోన్ కాల్స్ పోటెత్తాయి. వారందరికీ సమాధానం చెప్పలేక కార్యాలయం సిబ్బంది సతమతమయ్యారు. దీంతో చివరకు ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. విజయకాంత్ అంటే పడని వారే ఈ పుకార్లు సృష్టించారని డీఎండీకే నేతలు మండిపడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News