ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌కు తిరుమల తాయిలం!

టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమైన రాజేంద్రనగర్‌ టీటీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ను బుజ్జగించడంలో టీడీపీ అధిష్టానం కొంతవరకు సఫలమైనట్టు తెలుస్తోంది. ఉదయం చంద్రబాబును ప్రకాశ్‌గౌడ్ కలిశారు. పార్టీ మారవద్దని చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ ఒత్తిళ్లకు తలొగ్గాల్సిన అవసరం లేదని… పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అదే సమయంలో తిరుమల తిరుపతి దేవాస్థానం బోర్డులో సభ్యుడిగా నియమిస్తామని ప్రకాశ్‌గౌడ్‌కు చంద్రబాబు హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటి వరకు తెలంగాణ నుంచి టీటీడీ బోర్డులో సభ్యుడిగా ఉన్న […]

Advertisement
Update: 2015-12-06 09:00 GMT

టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమైన రాజేంద్రనగర్‌ టీటీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ను బుజ్జగించడంలో టీడీపీ అధిష్టానం కొంతవరకు సఫలమైనట్టు తెలుస్తోంది. ఉదయం చంద్రబాబును ప్రకాశ్‌గౌడ్ కలిశారు. పార్టీ మారవద్దని చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ ఒత్తిళ్లకు తలొగ్గాల్సిన అవసరం లేదని… పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అదే సమయంలో తిరుమల తిరుపతి దేవాస్థానం బోర్డులో సభ్యుడిగా నియమిస్తామని ప్రకాశ్‌గౌడ్‌కు చంద్రబాబు హామీ ఇచ్చినట్టు సమాచారం.

ఇప్పటి వరకు తెలంగాణ నుంచి టీటీడీ బోర్డులో సభ్యుడిగా ఉన్న కంటోన్మెంట్ టీడీపీ ఎమ్మెల్యే సాయన్న ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేశారు. దీంతో ఆయన్ను టీటీడీ బోర్డు నుంచి తప్పించి ఆ స్థానంలో ప్రకాశ్‌గౌడ్‌ను నియమించాలని చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబు ఆఫర్‌తో పార్టీ మారే విషయంలో ప్రకాశ్‌ గౌడ్‌ కూడా పునరాలోచనలో పడ్డారు. ప్రకాశ్‌గౌడ్‌కు టీటీడీ బోర్డులో సభ్యుడిగా నియమిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయాన్ని టీడీపీకి సన్నిహితంగా ఉండే మీడియా సంస్థలు కూడా ధృవీకరిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News