స్వామిజీలు... పెళ్లి చేసుకుని ఒకరిని పుట్టించండి

దేశంలో పెరిగిపోతున్న అసహనంపై ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్‌ తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయ మైదానంలో జరిగిన బహిరంగసభలో ప్రసంగించిన అసద్… గో మాంసం వివాదంపైనా మాట్లాడారు. ”ముస్లింలు సహనం చూపేందుకు బహిరంగంగా పంది మాంసం తినాలని త్రిపుర గవర్నర్‌ అంటున్నారని… తాను కూడా హిందువులు వారి సహనాన్ని ప్రదర్శించడానికి కల్యాణి బిర్యానీ తినాలి” అంటే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. Click to Read: అడిగాను… తప్పేంటి? గోవు మాంసం తిన్నంత మాత్రాన మనుషులను […]

Advertisement
Update: 2015-12-03 18:49 GMT

దేశంలో పెరిగిపోతున్న అసహనంపై ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్‌ తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయ మైదానంలో జరిగిన బహిరంగసభలో ప్రసంగించిన అసద్… గో మాంసం వివాదంపైనా మాట్లాడారు. ”ముస్లింలు సహనం చూపేందుకు బహిరంగంగా పంది మాంసం తినాలని త్రిపుర గవర్నర్‌ అంటున్నారని… తాను కూడా హిందువులు వారి సహనాన్ని ప్రదర్శించడానికి కల్యాణి బిర్యానీ తినాలి” అంటే ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

Click to Read: అడిగాను… తప్పేంటి?

గోవు మాంసం తిన్నంత మాత్రాన మనుషులను చంపుతారా?… మనుషుల కన్నా జంతువుల ప్రాణాలే ముఖ్యమా ? అని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం మనుషుల సంగతి పక్కన పెట్టి గోవులను రక్షించే పనిలో ఉందని ఎద్దేవా చేశారు. పప్పు ధరల కన్నా మాంసం ధరలే తక్కువగా ఉన్నాయని అందుకే నిరుపేదలు బీఫ్ తింటున్నారని చెప్పారు. దేశంలో ముస్లింల జనాభా పెరిగిపోతోందంటూ ఆర్‌ఎస్ఎస్‌ లాంటి సంస్థలు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. దమ్ముంటే స్వామీజీలు పెళ్లి చేసుకొని ఒకరిని పుట్టించి చూపించాలని అసద్ అన్నారు. .

Click to Read: When KCR’s best friend meets KCR’s worst enemy!

Tags:    
Advertisement

Similar News