దశాబ్దాల తర్వాత కలుస్తున్న మేటి జంట

లోకనాయకుడు కమల్ హాసన్, అక్కినేని అమల కలిసి ఓ సినిమా చేసి చాన్నాళ్లయింది. అప్పుడెప్పుడో వచ్చిన పుష్పక విమానం సినిమా తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ కలిసి నటించలేదు. నిజానికి అమల, నాగ్ ను పెళ్లాడిన తర్వాత సినిమాలు ఆపేసింది. పూర్తిగా ఇంటికే పరిమితమైంది. ఈమధ్యకాలంలో కొన్నిసినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో మాత్రమే కనిపిస్తోంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో కీలక పాత్ర పోషించడంతో పాటు మనం లాంటి సినిమాల్లో మెరిసింది. రీఎంట్రీలో భాగంగా మరోసారి ముఖానికి రంగేసుకున్న అమల, […]

Advertisement
Update: 2015-11-03 19:04 GMT
లోకనాయకుడు కమల్ హాసన్, అక్కినేని అమల కలిసి ఓ సినిమా చేసి చాన్నాళ్లయింది. అప్పుడెప్పుడో వచ్చిన పుష్పక విమానం సినిమా తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ కలిసి నటించలేదు. నిజానికి అమల, నాగ్ ను పెళ్లాడిన తర్వాత సినిమాలు ఆపేసింది. పూర్తిగా ఇంటికే పరిమితమైంది. ఈమధ్యకాలంలో కొన్నిసినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో మాత్రమే కనిపిస్తోంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో కీలక పాత్ర పోషించడంతో పాటు మనం లాంటి సినిమాల్లో మెరిసింది. రీఎంట్రీలో భాగంగా మరోసారి ముఖానికి రంగేసుకున్న అమల, మళ్లీ కమల్ తో నటించడానికి ఒప్పుకుంది. ఈ విషయాన్ని స్వయంగా కమల్ హాసన్ వెల్లడించాడు. చీకటి రాజ్యం సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టిన కమల్ హాసన్.. త్వరలోనే అమలతో కలిసి సినిమా చేయబోతున్నట్టు ఎనౌన్స్ చేశాడు. దర్శకుడు టీకే రాజీవ్ చెప్పిన ఓ స్టోరీలైన్ తామిద్దరికీ నచ్చిందన్నాడు. త్వరలోనే అమెరికాలో ఈ సినిమా షూటింగ్ ఉంటుందని స్పష్టంచేశాడు కమల్.
Tags:    
Advertisement

Similar News