చంద్రబాబు కొత్త అవతారం

అమరావతి శంకుస్థాపనను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తానే బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయి ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో మరో అడుగు ముందుకేసిన చంద్రబాబు ఏకంగా పలక ప్రచారం మొదలుపెట్టారు. పలకపై ‘మన అమరావతి- మన రాజధాని” అని రాసుకుని ఫోటో దిగి ట్విట్టర్‌లో పోస్టు చేశారు.  ప్రజలు కూడా ఇలాగే ఫోటో దిగి ”మన అమరావతి- మన రాజధాని” ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయాలని పిలుపునిచ్చారు. అమరావతికి మద్దతు ఇవ్వాలని కోరారు. […]

Advertisement
Update: 2015-10-20 22:17 GMT

అమరావతి శంకుస్థాపనను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తానే బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయి ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో మరో అడుగు ముందుకేసిన చంద్రబాబు ఏకంగా పలక ప్రచారం మొదలుపెట్టారు. పలకపై ‘మన అమరావతి- మన రాజధాని” అని రాసుకుని ఫోటో దిగి ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

ప్రజలు కూడా ఇలాగే ఫోటో దిగి ”మన అమరావతి- మన రాజధాని” ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయాలని పిలుపునిచ్చారు. అమరావతికి మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే చంద్రబాబు ప్రయత్నం మంచిదే అయినా.. ఇలా పలకపై రాసుకుని ప్రచారం చేయడం బాగో లేదంటున్నారు పార్టీ నేతలు. దీనిపై పాజిటివ్‌గా కన్నా నెగిటివ్‌గా ప్రచారమే ఎక్కువగా జరిగే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News