బాలయ్య ఫ్యాన్స్ రూటే సపరేటు

అమరావతి శంకుస్థాపనకు ఓవైపు ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ఇటు మై బ్రిక్స్- మై అమరావతి వెబ్ సైట్ కు కూడా అనూహ్య స్పందన వస్తోంది. ఎన్నారైలతోపాటు లక్షలాది మంది ఆన్ లైన్ లో ఇటుకలను కొంటూ తమవంతు సాయం చేస్తున్నారు. ఇప్పుడు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య అభిమానుల వంతు వచ్చింది. తాము కూడా రాజధాని నిర్మాణంలో భాగస్వాములం అవతామంటున్నారు. బాలయ్య పేరుతో లక్ష ఇటుకలను అమరావతి శంకుస్థాపనకు అందజేస్తున్నట్టు ప్రకటించారు. రాజధాని నిర్మాణంలో తమ […]

Advertisement
Update: 2015-10-19 19:11 GMT

అమరావతి శంకుస్థాపనకు ఓవైపు ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ఇటు మై బ్రిక్స్- మై అమరావతి వెబ్ సైట్ కు కూడా అనూహ్య స్పందన వస్తోంది. ఎన్నారైలతోపాటు లక్షలాది మంది ఆన్ లైన్ లో ఇటుకలను కొంటూ తమవంతు సాయం చేస్తున్నారు. ఇప్పుడు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య అభిమానుల వంతు వచ్చింది. తాము కూడా రాజధాని నిర్మాణంలో భాగస్వాములం అవతామంటున్నారు. బాలయ్య పేరుతో లక్ష ఇటుకలను అమరావతి శంకుస్థాపనకు అందజేస్తున్నట్టు ప్రకటించారు.

రాజధాని నిర్మాణంలో తమ భాగస్వామ్యం కూడా ఉండాలన్న ఉద్దేశ్యంతో బాలకృష్ణ హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ముందుకొచ్చింది. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి తమ వంతు బాధ్యతగా ఒక లక్ష ఇటుకల అందజేస్తున్నట్టు యన్ బికె హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు జగన్ తెలిపారు. ప్రతి ఇటుకపై జై బాలయ్య అని వ్రాసి త్వరలో బాలయ్యకు అందజేస్తామని తెలిపారు. మొత్తం మీద అందరూ బై బ్రిక్స్ మై అమరావతి సైట్లో ఇటుకలు కొంటూ ఉంటే బాలయ్య ఫ్యాన్స్ మాత్రం నిజంగానే ఇటుకలు తయారు చేసి రాజధాని నిర్మాణానికి అందజేయనున్నారు.

Tags:    
Advertisement

Similar News