శంకుస్థాపనకు పవన్‌ రానట్లేనా ?

అమరావతి శంకుస్థానకు రావాల్సిందిగా జనసేన అధ్యక్షుడు పవన్ కలిసి మంత్రులు కామినేని, అయ్యన్నపాత్రుడు ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి మరో హైదరాబాద్ కాకూడదని కోరుకుంటున్నానని చెప్పారు. అందరు ఆనందంగా ఉండే రాజధాని నిర్మాణం జరగాలన్నది తన ఉద్దేశం అని చెప్పారు. జరుగుతున్న భారీ ఏర్పాట్లను చూస్తున్నానని చెప్పారు. శంకుస్థాపన కార్యక్రమానికి వస్తారా లేదా అన్న దానిపై పవన్ స్పష్టత ఇవ్వలేదు. ఆ సమయంలో తాను షూటింగ్‌ కోసం గుజరాత్ […]

Advertisement
Update: 2015-10-17 00:36 GMT

అమరావతి శంకుస్థానకు రావాల్సిందిగా జనసేన అధ్యక్షుడు పవన్ కలిసి మంత్రులు కామినేని, అయ్యన్నపాత్రుడు ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి మరో హైదరాబాద్ కాకూడదని కోరుకుంటున్నానని చెప్పారు. అందరు ఆనందంగా ఉండే రాజధాని నిర్మాణం జరగాలన్నది తన ఉద్దేశం అని చెప్పారు. జరుగుతున్న భారీ ఏర్పాట్లను చూస్తున్నానని చెప్పారు.

శంకుస్థాపన కార్యక్రమానికి వస్తారా లేదా అన్న దానిపై పవన్ స్పష్టత ఇవ్వలేదు. ఆ సమయంలో తాను షూటింగ్‌ కోసం గుజరాత్ వెళ్తున్నానని … చూడాలి ఆ రోజుకు షెడ్యూల్ ఎలా ఉంటుందో అని సమాధానం దాటవేశారు. చంద్రబాబుకు సలహానిచ్చేంత అనుభవం తనకు లేదన్నారు.

Tags:    
Advertisement

Similar News