'దాద్రిలో హిందువులకు తుపాకులిస్తాం'

ఉత్తరప్రదేశ్‌లోని దాద్రిలో మహమ్మద్ ఇక్లాక్ హత్య నేపథ్యంలో అక్కడ హిందువులకు బెదిరింపులు వస్తున్నాయని, వారిని రక్షించడంలో భాగంగా తుపాకులు ఇస్తామని హిందూ యువ వాహిని సంస్థ ప్రకటించింది. హిందువుల ఆత్మరక్షణ కోసం తుపాకులు ఇవ్వడంలో తప్పులేదని బిజెపి ఎంపీ ఆదిత్యనాథ్ స్థాపించిన “హిందూ యువ వాహిని” సంస్థ పేర్కొంది. బిషాడ గ్రామంలోని హిందూ కుటుంబాలను కలుసుకునేందుకు ఈ సంస్థ సభ్యులు ప్రయత్నించగా నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని పోలీసులు వారిని అడ్డుకున్నారు. వేధింపులకు గురవుతున్న హిందువుల రక్షణ కోసం […]

Advertisement
Update: 2015-10-07 12:35 GMT

ఉత్తరప్రదేశ్‌లోని దాద్రిలో మహమ్మద్ ఇక్లాక్ హత్య నేపథ్యంలో అక్కడ హిందువులకు బెదిరింపులు వస్తున్నాయని, వారిని రక్షించడంలో భాగంగా తుపాకులు ఇస్తామని హిందూ యువ వాహిని సంస్థ ప్రకటించింది. హిందువుల ఆత్మరక్షణ కోసం తుపాకులు ఇవ్వడంలో తప్పులేదని బిజెపి ఎంపీ ఆదిత్యనాథ్ స్థాపించిన “హిందూ యువ వాహిని” సంస్థ పేర్కొంది. బిషాడ గ్రామంలోని హిందూ కుటుంబాలను కలుసుకునేందుకు ఈ సంస్థ సభ్యులు ప్రయత్నించగా నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని పోలీసులు వారిని అడ్డుకున్నారు. వేధింపులకు గురవుతున్న హిందువుల రక్షణ కోసం ‘తన్ మన్ ధన్ గన్’ ఇలా ఏవి అవసరమైతే అవన్నీ ఇచ్చి పూర్తి సహకారం అందిస్తామని “హిందూ యువ వాహిని” ప్రతినిధి జితేంద్ర త్యాగి అన్నారు.

Tags:    
Advertisement

Similar News