రెండు జిల్లాల్లో పిడుగుపాటుకు ముగ్గురు మృతి

పిడుగుపాటుకు నిజామాబాద్‌ జిల్లాలో ఇద్దరు, వరంగల్ జిల్లాలో ఒకరు మృతి చెందారు. నిజామాబాద్‌ జిల్లాలోని ఎడవల్లి మండలం కుర్నపల్లిలో పిడుగు పడడంతో ఇద్దరు చనిపోయారు. పొలం పనులు చేసుకుంటుండగా ఈ సంఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. వరంగల్‌ జిల్లా గూడూరు మండలం బోల్లేపల్లి శివారులోని వడ్డెర గూడంలో లలిత అనే ఓ మహిళ రైతు ప్రాణాలు కోల్పోయింది. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇలా పిడుగుపాటుకు దర్మరణం చెందడం, అకాల మృత్యువుకు […]

Advertisement
Update: 2015-10-01 13:10 GMT

పిడుగుపాటుకు నిజామాబాద్‌ జిల్లాలో ఇద్దరు, వరంగల్ జిల్లాలో ఒకరు మృతి చెందారు. నిజామాబాద్‌ జిల్లాలోని ఎడవల్లి మండలం కుర్నపల్లిలో పిడుగు పడడంతో ఇద్దరు చనిపోయారు. పొలం పనులు చేసుకుంటుండగా ఈ సంఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. వరంగల్‌ జిల్లా గూడూరు మండలం బోల్లేపల్లి శివారులోని వడ్డెర గూడంలో లలిత అనే ఓ మహిళ రైతు ప్రాణాలు కోల్పోయింది. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇలా పిడుగుపాటుకు దర్మరణం చెందడం, అకాల మృత్యువుకు బలైపోవడం ఆయా కుటుంబాల్లో విషాధం నింపింది. మృతుల బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Tags:    
Advertisement

Similar News