రాజధాని శంకుస్థాపనకు రూ.50 కోట్లా: సీపీఐ

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏభై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సిపిఐ ఆంద్ర ప్రదేశ్ కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. ఒక వైపు రాష్ట్రం ఆర్దిక సమస్యలలో ఉందని చెబుతున్న చంద్రబాబు రాజధాని నిర్మాణానికి ఏభై కోట్లు ఖర్చు చేసి హడావుడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రూ. 16 వేల కోట్లు అవసరమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఏడాదికి 400 కో్ట్లు ఇస్తే అది ఎప్పటికి పూర్తి అవుతుందని ఆయన ప్రశ్నించారు. […]

Advertisement
Update: 2015-09-27 01:02 GMT
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏభై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సిపిఐ ఆంద్ర ప్రదేశ్ కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. ఒక వైపు రాష్ట్రం ఆర్దిక సమస్యలలో ఉందని చెబుతున్న చంద్రబాబు రాజధాని నిర్మాణానికి ఏభై కోట్లు ఖర్చు చేసి హడావుడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రూ. 16 వేల కోట్లు అవసరమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఏడాదికి 400 కో్ట్లు ఇస్తే అది ఎప్పటికి పూర్తి అవుతుందని ఆయన ప్రశ్నించారు. అలాగే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా జిల్లాకు ఏభై కోట్లు కేటాయిస్తే, మంచినీటి సమస్య కూడా పరిష్కారం కాదని అన్నారు. ప్రత్యేక హోదాను పక్కనపెట్టి ప్రత్యేక ప్యాకేజీపైనే ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు అర్ధమవుతుందని రామకృష్ణ వ్యాఖ్యానించారు.
Tags:    
Advertisement

Similar News