ఇంటి యజమానిని కొట్టి.. భార్యపై అత్యాచారం

ముగ్గురు సైనికులు మధ్యప్రదేశ్‌లోని లధుకూయి గ్రామంలోని ఓ రైతు ఇంటిపై దాడి చేసి నిలువునా దోచుకున్నారు. అంతేకాకుండా ఇంటి యజమానిపై దాడి చేసి అతని భార్యపై అత్యాచారం చేశారు. ఇంకా అతని 14 ఏళ్ల కుమార్తెను వివస్త్రను చేసి హింసించారు. సైనిక దుస్తుల్లో ఉన్న ఈ ముగ్గురు తుపాకులతో ఇంట్లోకి చొరబడ్డారని నస్రుల్లాగంజ్ ఇన్‌స్పెక్టర్ అనిల్ త్రిపాఠి తెలిపారు. ఇంటి యజమానిపై విచక్షణా రహితంగా దాడి చేసి ఇంట్లోని నగదు, విలువైన వస్తువులను దోచుకెళ్లారు. అనంతరం అతని […]

Advertisement
Update: 2015-09-26 15:01 GMT

ముగ్గురు సైనికులు మధ్యప్రదేశ్‌లోని లధుకూయి గ్రామంలోని ఓ రైతు ఇంటిపై దాడి చేసి నిలువునా దోచుకున్నారు. అంతేకాకుండా ఇంటి యజమానిపై దాడి చేసి అతని భార్యపై అత్యాచారం చేశారు. ఇంకా అతని 14 ఏళ్ల కుమార్తెను వివస్త్రను చేసి హింసించారు. సైనిక దుస్తుల్లో ఉన్న ఈ ముగ్గురు తుపాకులతో ఇంట్లోకి చొరబడ్డారని నస్రుల్లాగంజ్ ఇన్‌స్పెక్టర్ అనిల్ త్రిపాఠి తెలిపారు. ఇంటి యజమానిపై విచక్షణా రహితంగా దాడి చేసి ఇంట్లోని నగదు, విలువైన వస్తువులను దోచుకెళ్లారు. అనంతరం అతని భార్యపై అత్యాచారం చేశారు. దుండగుల కోసం గాలింపు చేపట్టామని, వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

Tags:    
Advertisement

Similar News