మళ్ళీ ఇద్దరు ‘నారాయణ’ విద్యార్థుల ఆత్మహత్య

నారాయణ కాలేజీ జూనియర్‌ ఇంటర్‌ విద్యార్థులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఒకరు కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని నారాయణ రెసిడెన్షియల్‌ కాలేజీలో చదువుతుండగా మరొకరు విజయవాడలోని నిడమానూరు నారాయణ బ్రాంచీలో చదవుతున్నారు. ఓర్వకల్లు నారాయణ క్యాంపస్‌లో ఎంపీసీ మొదటి సంవత్సరం విద్యార్థి శ్రీకాంత్‌… కల్లూరు మండలం ఉల్లిందకొండ గ్రామానికి చెందినవాడు.  శ్రీకాంత్‌ తరగతి గది నుంచి బాత్‌రూమ్‌ కని బయటకు వెళ్ళి ఉరేసుకున్నాడు. దీన్ని గమనించిన హాస్టల్‌ సిబ్బంది శ్రీకాంత్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి […]

Advertisement
Update: 2015-09-26 00:39 GMT
నారాయణ కాలేజీ జూనియర్‌ ఇంటర్‌ విద్యార్థులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఒకరు కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని నారాయణ రెసిడెన్షియల్‌ కాలేజీలో చదువుతుండగా మరొకరు విజయవాడలోని నిడమానూరు నారాయణ బ్రాంచీలో చదవుతున్నారు. ఓర్వకల్లు నారాయణ క్యాంపస్‌లో ఎంపీసీ మొదటి సంవత్సరం విద్యార్థి శ్రీకాంత్‌… కల్లూరు మండలం ఉల్లిందకొండ గ్రామానికి చెందినవాడు. శ్రీకాంత్‌ తరగతి గది నుంచి బాత్‌రూమ్‌ కని బయటకు వెళ్ళి ఉరేసుకున్నాడు. దీన్ని గమనించిన హాస్టల్‌ సిబ్బంది శ్రీకాంత్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి 9 గంటలకు మృతి చెందాడు. విజయవాడలోని నిడమానూరు నారాయణ బ్రాంచీలో అఖిల్‌ తేజ్‌కుమార్‌ రెడ్డి అనే మరో విద్యార్థి కూడా ఉరి వేసుకునే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒంగోలు పట్టణానికి చెందిన తేజ్‌కుమార్‌ రెడ్డి (16) మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. చదువులో ఒత్తిడి కారణగానే శ్రీకాంత్‌, తేజ్‌కుమార్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
Tags:    
Advertisement

Similar News