ఉరి వేసుకుని తహశీల్దార్ ఆత్మహత్య

వరంగల్ జిల్లా చిట్యాల మండల తహాశీల్దార్ మంచికట్ల ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన రెండున్నర ఏళ్లుగా చిట్యాలలోనే తాహసిల్దారుగా ఉద్యోగం చేస్తున్నారు. హనుమకొండలోని ప్రగతినగర్‌లో నివాసం ఉండే శ్రీనివాస్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజుల క్రితం కుమార్తె పుట్టిన రోజు కార్యక్రమం కూడా చేసిన ఆయన ఇలా అకస్మాత్తుగా బలవన్మరణానికి పాల్పడడం అందరినీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన ఆత్మహత్య చేసుకోవడం కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది. అయితే కుటుంబ సమస్యల కారణంగానే మంచికట్ల ఆత్మహత్య చేసుకున్నారని […]

Advertisement
Update: 2015-09-25 13:14 GMT

వరంగల్ జిల్లా చిట్యాల మండల తహాశీల్దార్ మంచికట్ల ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన రెండున్నర ఏళ్లుగా చిట్యాలలోనే తాహసిల్దారుగా ఉద్యోగం చేస్తున్నారు. హనుమకొండలోని ప్రగతినగర్‌లో నివాసం ఉండే శ్రీనివాస్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజుల క్రితం కుమార్తె పుట్టిన రోజు కార్యక్రమం కూడా చేసిన ఆయన ఇలా అకస్మాత్తుగా బలవన్మరణానికి పాల్పడడం అందరినీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన ఆత్మహత్య చేసుకోవడం కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది. అయితే కుటుంబ సమస్యల కారణంగానే మంచికట్ల ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నారు. గజిటెడ్‌ హోదాలో ఉన్న అధికారి ఇలా ఆత్మహత్యకు పాల్పడడం చర్చనీయాంశమైంది.

Tags:    
Advertisement

Similar News