అనుమతి ఇవ్వకున్నా దీక్ష అక్కడే: బొత్స

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌ దీక్షను అడ్డుకోవడం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎంత భయపడుతుందో అర్ధమవుతుందని ఆ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. పోలీసులు అనుమతులు ఇవ్వకున్నా.. అనుకున్న స్థలంలోనే ఈ నెల 26 నుంచి ప్రత్యేక హోదా కోసం జగన్మోహనరెడ్డి దీక్ష చేస్తారని తెలిపారు. ప్రైవేటు స్థలంలో దీక్షలు చేసుకోవాలని పోలీసులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ కోసం దీక్ష చేస్తామంటే అనుమతి ఇవ్వకపోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమరణ దీక్ష […]

Advertisement
Update: 2015-09-23 19:15 GMT
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌ దీక్షను అడ్డుకోవడం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎంత భయపడుతుందో అర్ధమవుతుందని ఆ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. పోలీసులు అనుమతులు ఇవ్వకున్నా.. అనుకున్న స్థలంలోనే ఈ నెల 26 నుంచి ప్రత్యేక హోదా కోసం జగన్మోహనరెడ్డి దీక్ష చేస్తారని తెలిపారు. ప్రైవేటు స్థలంలో దీక్షలు చేసుకోవాలని పోలీసులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ కోసం దీక్ష చేస్తామంటే అనుమతి ఇవ్వకపోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమరణ దీక్ష చేస్తానని జగన్‌ ప్రకటించిన నాటి నుంచి చంద్రబాబు సర్కారు కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. అరెస్టులు చేసినా ముందుగా ప్రకటించిన స్థలంలోనే జగన్‌ దీక్ష చేస్తారని బొత్స పేర్కొన్నారు.
Tags:    
Advertisement

Similar News