కలాం ఆంధ్రలో పుట్టాలి: ఎర్రబెల్లి

మాజీ రాష్ట్రపతి ఏపీజె అబ్దుల్‌ మహోన్నత వ్యక్తి అని, దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు కొనియాడారు. అసెంబ్లీలో ఆయనకు నివాళులర్పించే తీర్మానంపై మాట్లాడుతూ అబ్దుల్ కలాం గొప్ప వ్యక్తి అని చెబుతూ… కలాం లాంటి వ్యక్తులు పుడితే మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌లోనే పుట్టాలని వ్యాఖ్యానించారు. తెలంగాణకు చెందిన ఎర్రబెల్లి ఆంధ్రప్రదేశ్‌ జపం చేయడం ఏమిటా అని సభ్యులంతా ఒక్క క్షణం విస్తుపోయారు. కొందరు సభ్యులు నవ్వుకోగా మరికొందరు అభ్యంతరం తెలిపారు. దీంతో […]

Advertisement
Update: 2015-09-23 06:24 GMT
మాజీ రాష్ట్రపతి ఏపీజె అబ్దుల్‌ మహోన్నత వ్యక్తి అని, దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు కొనియాడారు. అసెంబ్లీలో ఆయనకు నివాళులర్పించే తీర్మానంపై మాట్లాడుతూ అబ్దుల్ కలాం గొప్ప వ్యక్తి అని చెబుతూ… కలాం లాంటి వ్యక్తులు పుడితే మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌లోనే పుట్టాలని వ్యాఖ్యానించారు. తెలంగాణకు చెందిన ఎర్రబెల్లి ఆంధ్రప్రదేశ్‌ జపం చేయడం ఏమిటా అని సభ్యులంతా ఒక్క క్షణం విస్తుపోయారు. కొందరు సభ్యులు నవ్వుకోగా మరికొందరు అభ్యంతరం తెలిపారు. దీంతో నాలుక కరుచుకున్న ఎర్రబెల్లి ఏపీ కాదు తెలంగాణ అంటూ కవర్‌ చేసే ప్రయత్నం చేశారు. సభలో సభ్యులు అభ్యంతరం తెలపడంతో… ఎర్రబెల్లి అక్కడున్న వాతావరణాన్ని కాస్తంత తేలికపరుస్తూ నవ్వులు చిందిస్తూ… ‘సారీ.. సారీ.. కలాం తెలంగాణలోనే పుట్టాలి… తెలుగు ప్రజల్లోనే పుట్టాలి’ అంటూ సమర్దించుకున్నారు.
Tags:    
Advertisement

Similar News