చేతబడి చేస్తున్నారంటూ ముగ్గురికి దేహశుద్ధి

కృష్ణా జిల్లా తిరువూరు మండలం వామకుంట్ల గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. గ్రామంలో చాలామంది వ్యక్తులు గిట్టనివారిపై చేతబడి చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆగ్రహించిన గ్రామస్తులు నాగేశ్‌, వెంకట్రావమ్మ, రవిలపై దాడి చేశారు. వీరు క్షుద్రపూజలు చేస్తూ చేతబడి చేస్తున్నారని ఆరోపిస్తూ గ్రామ పొలిమేరల్లో వారిని పట్టుకొని చితకబాదారు. ఈ సంఘటనతో పోలీసులు వచ్చి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో 40 మంది చేతబడి చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తూ గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి […]

Advertisement
Update: 2015-09-17 13:06 GMT
కృష్ణా జిల్లా తిరువూరు మండలం వామకుంట్ల గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. గ్రామంలో చాలామంది వ్యక్తులు గిట్టనివారిపై చేతబడి చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆగ్రహించిన గ్రామస్తులు నాగేశ్‌, వెంకట్రావమ్మ, రవిలపై దాడి చేశారు. వీరు క్షుద్రపూజలు చేస్తూ చేతబడి చేస్తున్నారని ఆరోపిస్తూ గ్రామ పొలిమేరల్లో వారిని పట్టుకొని చితకబాదారు. ఈ సంఘటనతో పోలీసులు వచ్చి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో 40 మంది చేతబడి చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తూ గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.
Tags:    
Advertisement

Similar News