వీఆర్‌వోపై బ్లేడుతో రైతు దాడి

కడుపు మండిన ఓ రైతు గ్రామ రెవిన్యూ అధికారిపై దాడి చేశాడు. తాను ఎంతో కాలం నుంచి తిరుగుతున్నా పాస్‌ పుస్తకాలు ఇవ్వకుండా బాగా ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపిస్తూ అందరూ చూస్తుండగానే బ్లేడ్‌తో దాడి చేశాడు. యేడాది నుంచి తిరుగుతున్నా తనకు ఇవ్వాల్సిన పాస్‌ పుస్తకాలు ఇవ్వడం లేదని, అడిగితే రకరకాల కారణాలు చెప్పి తిప్పుతున్నాడని రైతు ఆరోపించాడు. విసిగిపోవడం వల్లే తాను వీఆర్‌వోపై దాడి చేశానని వివరించాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం […]

Advertisement
Update: 2015-09-13 13:07 GMT
కడుపు మండిన ఓ రైతు గ్రామ రెవిన్యూ అధికారిపై దాడి చేశాడు. తాను ఎంతో కాలం నుంచి తిరుగుతున్నా పాస్‌ పుస్తకాలు ఇవ్వకుండా బాగా ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపిస్తూ అందరూ చూస్తుండగానే బ్లేడ్‌తో దాడి చేశాడు. యేడాది నుంచి తిరుగుతున్నా తనకు ఇవ్వాల్సిన పాస్‌ పుస్తకాలు ఇవ్వడం లేదని, అడిగితే రకరకాల కారణాలు చెప్పి తిప్పుతున్నాడని రైతు ఆరోపించాడు. విసిగిపోవడం వల్లే తాను వీఆర్‌వోపై దాడి చేశానని వివరించాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ఏతూరు పంచాయతీలో జరిగింది.
Tags:    
Advertisement

Similar News