రైతుల మేలు కోసమే ప్రాజెక్టుల రీడిజైనింగ్: తుమ్మల
ఆత్మహత్యలు లేని తెలంగాణ కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని ప్రాజెక్టులను రీడిజైన్ చేస్తున్నరని ఆర్అండ్బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు ఆత్మహత్యలపై కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న తీరుపై ఆయన స్పందిస్తూ.. గత పదేళ్ల కాంగ్రెస్ పాలన ఫలితమే ఇప్పుడీ రైతుల ఆత్మహత్యలు. కాంగ్రెస్ పాలనలో 20 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన అన్నారు. ఇప్పుడు ఆ నేతలే రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని, అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి పట్టించుకోనివారు ఇప్పుడు […]
Advertisement
ఆత్మహత్యలు లేని తెలంగాణ కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని ప్రాజెక్టులను రీడిజైన్ చేస్తున్నరని ఆర్అండ్బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు ఆత్మహత్యలపై కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న తీరుపై ఆయన స్పందిస్తూ.. గత పదేళ్ల కాంగ్రెస్ పాలన ఫలితమే ఇప్పుడీ రైతుల ఆత్మహత్యలు. కాంగ్రెస్ పాలనలో 20 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన అన్నారు. ఇప్పుడు ఆ నేతలే రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని, అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి పట్టించుకోనివారు ఇప్పుడు రోడ్డెక్కి ధర్నాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఆత్మహత్యలు లేని తెలంగాణ కోసమే సీఎం కేసీఆర్ ప్రాజెక్టులను రీ ఇంజినీరింగ్ చేస్తున్నారని తుమ్మల అన్నారు.
Advertisement