రాజకీయ ఓనమాలు తెలియని జగన్‌: పల్లె

జగన్‌కు రాజకీయాలలో ఒనమాలు కూడా తెలియవని సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి అన్నారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇది కేవలం ప్రచారం కోసం పాకులాడడమేనని ఆయన ధ్వజమెత్తారు. ఒక ఫ్యాక్షనిస్టు మాదిరి జగన్ మాట్లాడుతున్నారని అన్నారు. జగన్‌కు ముఖ్యమంత్రి అయిపోవాలన్న యావ, సంపాదించిన లక్షల కోట్లను ఎలా దాచుకోవాలన్న ధ్యాస తప్ప మరో ఆలోచన లేదని ఆయన అన్నారు. జనాన్ని చంపే సంస్కృతి వైఎస్ రాజశేఖరరెడ్డిది, జగన్ లదేనని అన్నారు. […]

Advertisement
Update: 2015-08-31 04:16 GMT
జగన్‌కు రాజకీయాలలో ఒనమాలు కూడా తెలియవని సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి అన్నారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇది కేవలం ప్రచారం కోసం పాకులాడడమేనని ఆయన ధ్వజమెత్తారు. ఒక ఫ్యాక్షనిస్టు మాదిరి జగన్ మాట్లాడుతున్నారని అన్నారు. జగన్‌కు ముఖ్యమంత్రి అయిపోవాలన్న యావ, సంపాదించిన లక్షల కోట్లను ఎలా దాచుకోవాలన్న ధ్యాస తప్ప మరో ఆలోచన లేదని ఆయన అన్నారు. జనాన్ని చంపే సంస్కృతి వైఎస్ రాజశేఖరరెడ్డిది, జగన్ లదేనని అన్నారు. సంతాప తీర్మానాల సమయంలో కూడా జగన్‌ వెకిలిగా నవ్వడం… కేకలు వేయడం చూస్తే ఆయనో సైకోలా కనిపించారని అన్నారు. శాసనసభలో సంతాప తీర్మానాలు పెడితే ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం బాధాకరమని ఆయన అన్నారు. చనిపోయేవారు ఆత్మకు శాంతి కలగాలని ఒక్క నిమషంపాటు ప్రార్ధించాలన్న ధ్యాస కూడా జగన్‌కు లేదని ఆయన విమర్శించారు.
Tags:    
Advertisement

Similar News