చంద్రబాబుది పనికిమాలిన పాలన:వంగవీటి

చంద్రబాబు పనికిమాలిన పరిపాలనకి వ్యతిరేకంగా ప్రజలు చేసే పోరాటానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ నాయకుడు వంగవీటి రాధ అన్నారు.  మా ఇల్లు బందరు రోడ్డు మీద ఉంది. ఒకప్పుడు ఈ రోడ్డు మీద కుయ్‌ కుయ్‌ మని వాహనం వెళితే రాజశేఖరరెడ్డి వేసిన 108 అని చెప్పేవాళ్ళని, ఇపుడు కుయ్‌.. కుయ్‌… మని వాహనం వెళితే చంద్రబాబు వస్తున్నాడని చెబుతున్నారని, మాకు ఇదేం దౌర్భాగ్యమో అర్ధం కావడం లేదని ఆయన విమర్శించారు. […]

Advertisement
Update: 2015-08-27 06:10 GMT
చంద్రబాబు పనికిమాలిన పరిపాలనకి వ్యతిరేకంగా ప్రజలు చేసే పోరాటానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ నాయకుడు వంగవీటి రాధ అన్నారు. మా ఇల్లు బందరు రోడ్డు మీద ఉంది. ఒకప్పుడు ఈ రోడ్డు మీద కుయ్‌ కుయ్‌ మని వాహనం వెళితే రాజశేఖరరెడ్డి వేసిన 108 అని చెప్పేవాళ్ళని, ఇపుడు కుయ్‌.. కుయ్‌… మని వాహనం వెళితే చంద్రబాబు వస్తున్నాడని చెబుతున్నారని, మాకు ఇదేం దౌర్భాగ్యమో అర్ధం కావడం లేదని ఆయన విమర్శించారు. ఆయనకు పనిపాట లేనట్టు బెజవాడ వచ్చి కూర్చుంటున్నాడు… ఎప్పుడు చూసిన ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడమే… మాకిదేం దౌర్భాగ్యం భగవంతుడా? అంటూ ప్రజలు చీత్కరించుకుంటున్నారని రాధా విమర్శించారు. మంత్రులంతా రైతుల రాజధానికి భూములు స్వచ్ఛందంగా ఇచ్చినట్టు చెబుతున్నారని, అలాంటప్పుడు వారెందుకు రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తున్నారని ప్రశ్నించారు. తాము రాజధానికి విరుద్ధం కానేకాదని, బలవంతంగా భూములు లాక్కుంటే ఊరుకోమని హెచ్చరించారు. భూములు లాక్కోవడం, ఇళ్ళను కూల్చివేయడం చేస్తే పేదల నుంచి తిరుగుబాటు వస్తుందని, అలాంటి ఉద్యమాలకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు.

Full View

Tags:    
Advertisement

Similar News