జైలు వ్యాన్‌లో ఖైదీల ఘర్షణ.. ఇద్దరి మృతి

తీహార్ జైలుకు చెందిన వ్యాన్‌లో ఖైదీల మధ్య ఘర్షణ జరిగి ఇద్దరు మృతిచెందగా ఐదుగురు గాయపడ్డారు. ఏడుగురు ఖైదీలను తీహార్ జైలు నుంచి రోహిణి కోర్టుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో వారి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఐదుగురు, ఇద్దరు చొప్పున ఖైదీలు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. కొత్త సమస్యలు ఎక్కడ వస్తాయోనన్న భయంతో ఘర్షణ సమయంలో ఎస్కార్ట్ పోలీసులు వ్యాన్‌ను ఆపకుండా నేరుగా మంగోల్‌పూర్ దవాఖానకు తీసుకెళ్ళి పోయారు. అప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు […]

Advertisement
Update: 2015-08-25 13:08 GMT
తీహార్ జైలుకు చెందిన వ్యాన్‌లో ఖైదీల మధ్య ఘర్షణ జరిగి ఇద్దరు మృతిచెందగా ఐదుగురు గాయపడ్డారు. ఏడుగురు ఖైదీలను తీహార్ జైలు నుంచి రోహిణి కోర్టుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో వారి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఐదుగురు, ఇద్దరు చొప్పున ఖైదీలు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. కొత్త సమస్యలు ఎక్కడ వస్తాయోనన్న భయంతో ఘర్షణ సమయంలో ఎస్కార్ట్ పోలీసులు వ్యాన్‌ను ఆపకుండా నేరుగా మంగోల్‌పూర్ దవాఖానకు తీసుకెళ్ళి పోయారు. అప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.
Tags:    
Advertisement

Similar News