25న రాజధాని ప్రాంతాల్లోని గ్రామాల బంద్‌

ఏపీ రాజధానిలో భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడేందుకు అఖిల పక్షం సిద్ధమైంది. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం ఉండవల్లిలో అఖిలపక్షం సభ్యులు రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రైతులు, ప్రజాసంఘాలుతో పాటు వివిధ పార్టీల రాజకీయ నేతలు హాజరయ్యారు. భూసేకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష నేతలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రకాశం బ్యారేజీపై రైతులతో ధర్నా నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. ఈ నెల 24 నిడమర్రు సీఆర్డీఏ కార్యాలయం ముట్టడి, […]

Advertisement
Update: 2015-08-21 13:45 GMT

ఏపీ రాజధానిలో భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడేందుకు అఖిల పక్షం సిద్ధమైంది. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం ఉండవల్లిలో అఖిలపక్షం సభ్యులు రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రైతులు, ప్రజాసంఘాలుతో పాటు వివిధ పార్టీల రాజకీయ నేతలు హాజరయ్యారు. భూసేకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష నేతలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రకాశం బ్యారేజీపై రైతులతో ధర్నా నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. ఈ నెల 24 నిడమర్రు సీఆర్డీఏ కార్యాలయం ముట్టడి, 25న రాజధాని ప్రాంతాల్లోని గ్రామాల బంద్‌కు నేతలు పిలుపునిచ్చారు

Tags:    
Advertisement

Similar News