ఎన్నికలకు భయపడుతున్న తలసాని: మర్రి

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉప ఎన్నికలకు భయపడుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఓటర్ల తొలగింపు అంశాన్ని తాము ఈసి భన్వర్ లాల్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు. గ్రేటర్ పరిధిలో అర్హులైన ఓటర్ల జాబితాను తొలగిస్తున్నారని భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ కూడా పక్షపాతం చూపిస్తున్నారన్నారు. సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా నుంచి పలువురిని చట్టవిరుద్ధంగా తొలగిస్తున్నారని, తొలగించిన ఓటర్ల జాబితాను, వారి పేర్లతో సహా వెబ్ […]

Advertisement
Update: 2015-08-04 13:22 GMT
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉప ఎన్నికలకు భయపడుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఓటర్ల తొలగింపు అంశాన్ని తాము ఈసి భన్వర్ లాల్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు. గ్రేటర్ పరిధిలో అర్హులైన ఓటర్ల జాబితాను తొలగిస్తున్నారని భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ కూడా పక్షపాతం చూపిస్తున్నారన్నారు. సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా నుంచి పలువురిని చట్టవిరుద్ధంగా తొలగిస్తున్నారని, తొలగించిన ఓటర్ల జాబితాను, వారి పేర్లతో సహా వెబ్ సైట్లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
Tags:    
Advertisement

Similar News