19 మంది తమిళ స్మగ్లర్ల అరెస్టు

కడప జిల్లా కాశినాయన మండలం ఇటుకలపాడు నుంచి కొత్తకోట దాసరిపల్లె రిజర్వ్‌ ఫారెస్టులో 19 మంది తమిళ స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్ర చందనం స్మగ్లర్ల గ్రామమైన కర్ణాటక రాష్ట్రం కటిగెనహల్లి స్మగ్లర్లతో సంబంధాలున్న వీరు ఐషర్‌ వాహనంలో దుంగలను తీసుకెళ్ళేందుకు లోడ్‌ చేస్తుండగా పోలీసులు, అటవీ సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారు. వీరంతా తమిళనాడులోని వేలూరు జిల్లాకు చెందిన వారని, దాసరిపల్లె రిజర్వ్‌ ఫారెస్టు నుంచి దుంగలను తీసుకెళ్లే ప్రయత్నంలో ఉండగా అరెస్టు చేశామని […]

Advertisement
Update: 2015-07-30 13:22 GMT
కడప జిల్లా కాశినాయన మండలం ఇటుకలపాడు నుంచి కొత్తకోట దాసరిపల్లె రిజర్వ్‌ ఫారెస్టులో 19 మంది తమిళ స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్ర చందనం స్మగ్లర్ల గ్రామమైన కర్ణాటక రాష్ట్రం కటిగెనహల్లి స్మగ్లర్లతో సంబంధాలున్న వీరు ఐషర్‌ వాహనంలో దుంగలను తీసుకెళ్ళేందుకు లోడ్‌ చేస్తుండగా పోలీసులు, అటవీ సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారు. వీరంతా తమిళనాడులోని వేలూరు జిల్లాకు చెందిన వారని, దాసరిపల్లె రిజర్వ్‌ ఫారెస్టు నుంచి దుంగలను తీసుకెళ్లే ప్రయత్నంలో ఉండగా అరెస్టు చేశామని కడప ఆపరేషన్స్‌ ఏఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ తెలిపారు. 111 దుంగలతో పాటు ఐషర్‌ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఈ ఎర్రచందనం విలువ ఆరు కోట్ల రూపాయలుంటుందని తెలిపారు.
Tags:    
Advertisement

Similar News