పని వేళలు పెంపుతో కలాంకు ఏపీ నివాళి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల పని వేళలను మంగళవారం గంట పాటు పెంచారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కొద్దిసేపటి క్రితం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మృతి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తాను చనిపోయినప్పుడు సెలవు ప్రకటించవద్దంటూ ఆయన కోరినందున సెలవు ప్రకటించడానికి బదులుగా ఒక గంటపాటు అదనంగా పని చేయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ద్వారా […]

Advertisement
Update: 2015-07-27 13:20 GMT
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల పని వేళలను మంగళవారం గంట పాటు పెంచారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కొద్దిసేపటి క్రితం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మృతి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తాను చనిపోయినప్పుడు సెలవు ప్రకటించవద్దంటూ ఆయన కోరినందున సెలవు ప్రకటించడానికి బదులుగా ఒక గంటపాటు అదనంగా పని చేయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆయనకు నివాళులు అర్పించింది.
Tags:    
Advertisement

Similar News