ఒకే వేదికపైకి మెగాబ్రదర్స్

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకే వేదికపైకి వచ్చి చాలా ఏళ్లయింది. ఇన్నాళ్లకూ వాళ్లిద్దరూ కలిసి ఒకే డయాస్ ను షేర్ చేసుకోబోతున్నారు. చిరంజీవి 60వ పుట్టినరోజు నాడు పవన్ కల్యాణ్ కూడా వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వేదికపై మెగా బ్రదర్శ్ ను చూడొచ్చని అంతా ఆశపడుతున్నారు. అయితే అంతకంటే ముందే అన్నదమ్ములిద్దర్నీ కలిపారు రామోజీరావు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగ్ బ్రదర్స్ కలుసుకుంటారో లేదో చెప్పలేం కానీ.. రామోజీరావు ఏర్పాటుచేసిన […]

Advertisement
Update: 2015-07-19 21:30 GMT
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకే వేదికపైకి వచ్చి చాలా ఏళ్లయింది. ఇన్నాళ్లకూ వాళ్లిద్దరూ కలిసి ఒకే డయాస్ ను షేర్ చేసుకోబోతున్నారు. చిరంజీవి 60వ పుట్టినరోజు నాడు పవన్ కల్యాణ్ కూడా వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వేదికపై మెగా బ్రదర్శ్ ను చూడొచ్చని అంతా ఆశపడుతున్నారు. అయితే అంతకంటే ముందే అన్నదమ్ములిద్దర్నీ కలిపారు రామోజీరావు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగ్ బ్రదర్స్ కలుసుకుంటారో లేదో చెప్పలేం కానీ.. రామోజీరావు ఏర్పాటుచేసిన వేదిక సాక్షిగా మాత్రం వీళ్లిద్దరూ కలుసుకుంటున్నారు. ఈటీవీ 20ఏళ్ల వార్షికోత్సవంలో పవన్, చిరంజీవి కలిసి ఒకే వేదికను పంచుకున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఈటీవీ కొన్ని ప్రోమోల్ని కూడా ప్రసారం చేస్తోంది. త్వరలోనే ఈ ఎపిసోడ్ ను కూడా ప్రసారం చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. మరోవైపు ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజునాడు పవన్ వస్తాడా రాడా అనే విషయంపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
Tags:    
Advertisement

Similar News