కేసీఆర్‌ తీరుతో ఆంధ్రుల్లో ఆందోళన: ప్రత్తిపాటి

కేసీఆర్‌ తీరుతో ఆంధ్రులు ఆందోళన చెందుతున్నారని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రుల ఇళ్లను కూలగొట్ట‌డం నిజం కాదా అని ప్ర‌శ్నించారు. ఏడాది కాలంలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. పునర్విభజన చట్టంలోని అంశాలను గవర్నర్‌ అమలు చేయనందుకే ఈ పరిస్థితి నెలకొందని ప్రత్తిపాటి వ్యాఖ్యానించారు. సెక్షన్-8 అమలు చేయకపోతే ఆంధ్రా ప్రజలకు రక్షణ ఉండదన్నారు. హైదరాబాద్‌లో అధికారం కోల్పోతారనే సెక్షన్-8ను వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. రాజకీయాలు మాని ఆంధ్రుల హక్కులపై అన్ని పార్టీలు […]

Advertisement
Update: 2015-06-18 13:22 GMT

కేసీఆర్‌ తీరుతో ఆంధ్రులు ఆందోళన చెందుతున్నారని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రుల ఇళ్లను కూలగొట్ట‌డం నిజం కాదా అని ప్ర‌శ్నించారు. ఏడాది కాలంలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. పునర్విభజన చట్టంలోని అంశాలను గవర్నర్‌ అమలు చేయనందుకే ఈ పరిస్థితి నెలకొందని ప్రత్తిపాటి వ్యాఖ్యానించారు. సెక్షన్-8 అమలు చేయకపోతే ఆంధ్రా ప్రజలకు రక్షణ ఉండదన్నారు. హైదరాబాద్‌లో అధికారం కోల్పోతారనే సెక్షన్-8ను వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. రాజకీయాలు మాని ఆంధ్రుల హక్కులపై అన్ని పార్టీలు పోరాడాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు.

Advertisement

Similar News