బాబు గతి ఏమవుతుందో త్వరలో చూస్తారు: తలసాని

‘‘చంద్రబాబు గతి ఏమవుతుందో రేపో మాపో చూస్తారు. దర్యాప్తు సంస్థలు విచారణను ముమ్మరం చేశాయి. తప్పు చేస్తే ప్రజాస్వామ్యంలో ఎవరికీ మినహాయింపులు ఉండవు. దేశద్రోహం కేసులో కృష్ణాయాదవ్‌ గతంలో మూడేళ్లకుపైగా జైలులో గ‌డిపారు. ఆయన జాబితాలో చంద్రబాబు చేరతారు’’ అని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ వ్యాఖ్యానించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణతోపాటు పలు ఆరోపణలు చేస్తూ ఢిల్లీ పెద్దలకు చంద్రబాబు లేఖ రాశారంటూ తలసాని అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు ఒత్తిడిలో ఉన్నాడని, […]

Advertisement
Update: 2015-06-14 13:18 GMT

‘‘చంద్రబాబు గతి ఏమవుతుందో రేపో మాపో చూస్తారు. దర్యాప్తు సంస్థలు విచారణను ముమ్మరం చేశాయి. తప్పు చేస్తే ప్రజాస్వామ్యంలో ఎవరికీ మినహాయింపులు ఉండవు. దేశద్రోహం కేసులో కృష్ణాయాదవ్‌ గతంలో మూడేళ్లకుపైగా జైలులో గ‌డిపారు. ఆయన జాబితాలో చంద్రబాబు చేరతారు’’ అని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ వ్యాఖ్యానించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణతోపాటు పలు ఆరోపణలు చేస్తూ ఢిల్లీ పెద్దలకు చంద్రబాబు లేఖ రాశారంటూ తలసాని అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు ఒత్తిడిలో ఉన్నాడని, దేశమంతా తిరిగి తెలుగు ప్రజల పరువు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఫోన్‌ను ట్యాపింగ్‌ చేశారంటూ తమ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్‌ చేశారు.

Tags:    
Advertisement

Similar News