వైభవంగా ట్యాంక్బండ్పై తెలంగాణ వేడుకలు
ట్యాంక్బండ్పై తెలంగాణ ఆవిర్భావ ముగింపు వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలు సీఎం కె. చంద్రశేఖర్ రావు, గవర్నర్ నరసింహన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ట్యాంక్బండ్పై నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ ముగింపు ఉత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. మహిళలు బోనాలు, బతుకమ్మలతో తరలివచ్చారు. కళాకారుల ర్యాలీలు, నృత్యాలతో ట్యాంక్బండ్ పరిసరాలు హోరెత్తుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ట్యాంక్బండ్, సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన విద్యుత్ దీపాలు, లేజర్ […]
ట్యాంక్బండ్పై తెలంగాణ ఆవిర్భావ ముగింపు వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలు సీఎం కె. చంద్రశేఖర్ రావు, గవర్నర్ నరసింహన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ట్యాంక్బండ్పై నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ ముగింపు ఉత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. మహిళలు బోనాలు, బతుకమ్మలతో తరలివచ్చారు. కళాకారుల ర్యాలీలు, నృత్యాలతో ట్యాంక్బండ్ పరిసరాలు హోరెత్తుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ట్యాంక్బండ్, సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన విద్యుత్ దీపాలు, లేజర్ లైట్లు, బాణా సంచా, ఎలక్ర్టానిక్ పతంగులు ప్రత్యేక ఆకర్షణ నిలిచాయి. పోలీసు కవాతు, వివిధ శాఖ శకటాలు, కళాకారుల అద్భుత విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలో పాల్గొనేందుకు మంత్రులు కడియం శ్రీహరి, హరీష్రావు, ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, ఇంద్రకరణ్రెడ్డి, ఈటెల రాజేందర్ తదితరులు ట్యాంక్బండ్ వద్దకు చేరుకున్నారు.